TDP vs YSRCP in Vinayaka Chavithi: వినాయక చవితి వేడుకల్లో వివాదం.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ..
- వినాయక చవితి వేడుకల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ..
- అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో ఘటన..
- రామాలయం గణేష్ పూజల విషయంలో వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs YSRCP in Vinayaka Chavithi: వినాయక చవితి వేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.. అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం మొదలైంది.. పరవాడ మండలం, మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం.. అయితే వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.. చవితి ఉత్సవాల్లో భాగంగా పంచాయితీకి సంబంధించిన వినాయక విగ్రహం పెట్టేందుకు స్థానిక రామాలయం దగ్గర ఇరువర్గాల మధ్య ఘర్షణ స్టార్ట్ అయ్యింది.. గత రెండు రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.. రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు గ్రామపంచాయతీలో ఉన్న రామాలయానికి తాళం వేశారు.. అయితే, తర్వాత రోజు టీడీపీ వాళ్లు కూడా రామాలయానికి తాళం వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
Read Also: Mahindra University: మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో నలుగురు అరెస్టు..
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
ఈ రోజు వినాయక చవితి కావడంతో ఇరు వర్గాల నాయకులు రామాలయం దగ్గరకు చేరుకున్నారు.. దీంతో, ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి.. విషయం తెలుసుకున్న పరవాడ పోలీసులు రంగప్రవేశం చేశారు.. పరవాడ సీఐ మల్లికార్జున రావు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు.. టిడిపి నాయకులను, వైసీపీ నాయకులను ఇరువర్గాలకు నచ్చజెప్పి.. మొదటగా వినాయకుని మండపానికి పర్మిషన్ తీసుకున్నవాళ్లే రామాలయంలో పూజ చేసుకోవచ్చని సీఐ తెలిపారు.. కానీ, వెన్నెలపాలెం వైసీపీ సర్పంచ్ కి మాత్రం మండపాలు పర్మిషన్ అవసరం లేదని వాదనకు దిగాడు సర్పంచ్.. అయితే, సర్పంచ్ అయినా సరే పర్మిషన్ తీసుకోవాలని పరవాడ సీఐ తేల్చి చెప్పారు.. చివరికి టీడీపీ వాళ్లు పర్మిషన్ ముందుగా తీసుకోవడంతో రామాలయంలో టీడీపీ నాయకులు వినాయకునికి మొదటగా పూజలు చేశారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!