Parawada Pharma City: పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర ప్రమాదం.. సీఎం, హోం మంత్రి ఆరా.. జగన్ దిగ్భ్రాంతి
- అనకపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం..
- విషవాయులు లీకై కార్మికులకు అస్వస్థత.. ఒకరు మృతి..
- ప్రమాదంపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు.. హోం మంత్రి అనిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parawada Pharma City: అనకపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో నిన్న అర్థరాత్రి విషవాయులు లీకయ్యాయి.. కంపెనీలో పనిచేస్తున్న 9 మంది కార్మికులు అస్వస్థకు గురైయ్యారు.. ప్రమాదం జరిగిన విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు కంపెనీ యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా షీలనగర్ లోని కిమ్స్ ఐకాన్ హాస్పటల్ కి క్షతగాత్రులను తరలించింది యాజమాన్యం.. వీరిలో ఇద్దరు పరిస్థితి విసమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నరు ఠాగూర్ కంపెనీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Pushpa -2 : దేవిశ్రీ ప్రసాద్ వివాదంపై మైత్రీ నిర్మాతల రియాక్షన్
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
మరో వైపు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని… వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు.. మరోవైపు. విషవాయువు లీక్ అయిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు.. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల నిర్లక్ష్యవైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి, విష వాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు..జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నరు హోంమంత్రి అనిత.. ప్రమాదానికి కారణమైన వారిపై, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు అనంతరం కఠిన చర్యలుంటాయన్నారు హోంమంత్రి.
Read Also: Peanut Allergy: “పల్లీలు” యువతి ప్రాణం తీశాయి.. డేట్ కోసం వెళ్లి అనూహ్యంగా మృతి..
ఇక, అనకాపల్లి జిల్లా పరవాడలో ఠాగూర్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. విషవాయువు లీకై, ఒక కార్మికుడు చనిపోగా, 8 మంది అస్వస్థతకు గురైన ఘటనపై వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంతో పాటు, ఘటనలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!