Chirla Jaggireddy: అవినీతి గిన్నిస్ బుక్లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయి..!
- అవినీతి గిన్నిస్ బుక్ లో బండారు బ్రదర్స్ పేర్లు కచ్చితంగా ఉంటాయి..
- ప్రపంచంలో 8వ వింతగా కొత్తపేట నియోజకవర్గంలో..
- బండారు బ్రదర్స్ పెట్టిన పిరమిడ్ ఇసుక కొండలకు కచ్చితంగా పేరు వస్తుంది..
- అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chirla Jaggireddy: అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకి తెలుస్తుందని ఆరోపించారు. బండారు బ్రదర్స్ అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధం ఉన్నానని, అవినీతికి పాల్పడలేదని వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ జగ్గిరెడ్డి సవాల్ చేశారు. బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీటాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.
Read Also: PM Modi: విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించనున్న మోడీ
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.. అవినీతి గిన్నిస్ బుక్ లో బండారు బ్రదర్స్ పేర్లు కచ్చితంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. 8వ వింతగా కొత్తపేట నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ పెట్టిన పిరమిడ్ ఇసుక కొండలకు కచ్చితంగా పేరు వస్తుందని అన్నారు. బండారు బ్రదర్స్ లో బ్రహ్మానందం ఎవరో.. అలీ ఎవరో మీరే చెప్పాలని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రజలపై జరిగిన అక్రమాలకు అన్యాయాలకు మీరు నిన్న విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అమ్మఒడిగాని, చేయూతగాని, కాపు నేస్తం గాని, చంద్రబాబు ఇస్తే మీరు ఏ పండగ అయినా చేసుకోండి పర్వాలేదు అన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..