Deputy CM Pawan Kalyan visit: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో అనుమానాస్పద కదలికలు..! వైసీపీ నేతను విచారించిన ఎస్పీ..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో అనుమానాస్పద కదలికలు..
- వైసీపీ నేత నరసింహను ప్రశ్నించిన పోలీసులు..
Deputy CM Pawan Kalyan visit: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఈ మధ్యే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.. అయితే, పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది.. దీనిపై జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన నరసింహ అనే వ్యక్తిని విచారించారు జిల్లా ఎస్పీ.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నరసింహ.. తాను రైతు గానే పవన్ కల్యాణ్.. రైతుల సమావేశానికి వచ్చానని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. కాగా, 50 మంది వైసీపీ నేతలకు రైతుల సమావేశానికి పాస్ లు ఇచ్చారట స్థానిక ఎమ్మెల్యే.. మొత్తంగా పవన్ పర్యటనలో అనుమానాస్పద కదలికలపై వైసీపీ కార్యకర్త నరసింహను ప్రశ్నించిన పోలీసులు.. అవసరమైతే మళ్లీ పిలుస్తామని నరసింహకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఇక, తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి 50 సార్లు రక్తదానం చేశానని పోలీసుల విచారణలో నరసింహ తెలిపినట్టుగా తెలుస్తుంది..
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల 26వ తేదీన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు.. ఆ సందర్భంలో ఒక అపరిచిత వ్యక్తి పవన్కు అనుమానాస్పదంగా చేరువయ్యాడు అని జనసేన పార్టీ వర్గాలు చెపుతున్నాయి. శంకరగుప్తం ప్రాంతంలో డ్రెయిన్ లీకేజ్ వల్ల నష్టపోయిన కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలోనూ.. అధికారులతో మాట్లాడుతున్న సమయంలోనూ.. తర్వాతి కార్యక్రమాల వరకు కూడా ఆ వ్యక్తి డిప్యూటీ సీఎంకు చాలా దగ్గరగా తిరిగినట్లు వీడియోల్లో కనిపించింది. సదరు వ్యక్తి రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త అని డిప్యూటీ సీఎం కార్యాలయానికి సమాచారం చేరింది. అతడి వ్యవహారం, కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని అధికారులు భావించారు. ఈ మొత్తం విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి డిప్యూటీ సీఎం కార్యాలయం తీసుకెళ్లింది. కార్యక్రమానికి ఎలా వచ్చాడు. ఎవరూ ఇచ్చిన పాస్తో వచ్చాడు.. అతని కదలికల్లో ఏం అనుమానం ఉందో అన్ని వివరాలు ఎస్పీకి అందజేశారు. విషయంపై తగిన విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. అయితే, ఆ తర్వాత నరసింహను విచారించి పంపించారు పోలీసులు
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!