ONGC Pipeline Leak: రెండో రోజు కొనసాగుతున్న బ్లో అవుట్.. ఎగిసిపడుతున్న మంటలు..
- కోనసీమ జిల్లా ఇరుసమండ ఓఎన్జీసీ గ్యాస్ బావిలో అదుపులోకి రాని మంటలు..
- గ్యాస్ తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమే అంటున్న అధికారులు..
- బావిలో 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు..
- మధ్యాహ్నం లోపు మంటలు అదుపులోకి రాకపోతే బావి మూసివేతకు ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ONGC Pipeline Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు బ్లో అవుట్ కొనసాగుతున్నాయి. మల్కిపురం మండలం ఇరుసుమండలోని బావిలో నుంచి భారీగా లీక్ కావడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో ఈరోజు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. వాటర్ అంబరిల్లాలతో నాలుగు వైపుల నుంచి నీళ్లు విరజిమ్మి మంటలు అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పైపులను నరసాపురం నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 16 గంటలుగా ఏకధాటిగా బ్లో అవుట్ కొనసాగుతుంది.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య.. 24 గంటల్లో రెండో ఘటన
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
అయితే, అవసరమైన పైప్ లైన్లను ఇతర సామాగ్రిని రాజమండ్రి, నరసాపురం నుంచి ఓఎన్జీసీ అధికారులు తీసుకుని వస్తున్నట్లు తెలుస్తుంది. ఘటన స్థలానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఇక, కోనసీమను చమురు, సహజ వాయు నిక్షేపాలు వెలికితీత నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. తరచూ బ్లూ అవుట్స్ స్థానిక ప్రజలకు భయ పెడుతున్నాయి. రాజోలు మండలం తూర్పుపాలెంలో కొమరాడ 1 డ్రిల్లింగ్ సైట్ లో 1993 మార్చి 20వ తేదీన బ్లో అవుట్ ఏర్పడింది. మంటలు వ్యాపించడంతో వేల కొబ్బరి చెట్లు దగ్ధమైయ్యాయి. 26 రోజులు తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్ తో బావి మూసివేశారు.
Read Also: Mana Shankar Varaprasad Garu: మన శంకర్ వరప్రసాద్ గారు… దుమ్ము రేపేస్తున్నారు
అలాగే, 1995 జనవరి 8వ తేదీన డ్రిల్లింగ్ సమయంలో బ్లో అవుట్ రావడంతో అల్లవరం మండలంలోని దేవరలంక పాశర్లపూడి 19 బావిలో 65 రోజులు పాటు మంటలు ఎగసిపడ్డాయి, అనంతరం బీఓపీ మూసివేసేశారు. 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ బ్లో అవుట్ కారణంగా ఆరు రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక, 2014 జూన్ 27వ తేదీన మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ కి చెందిన ట్రంక్ లైన్ లో విస్పోటనం చెందడంతో 22 మంది మృతి చెందగా, 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడిలో డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ పేలుడుతో మూడు రోజులు తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?