ONGC Pipeline Leak: రెండో రోజు కొనసాగుతున్న బ్లో అవుట్.. ఎగిసిపడుతున్న మంటలు..
- కోనసీమ జిల్లా ఇరుసమండ ఓఎన్జీసీ గ్యాస్ బావిలో అదుపులోకి రాని మంటలు..
- గ్యాస్ తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమే అంటున్న అధికారులు..
- బావిలో 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు..
- మధ్యాహ్నం లోపు మంటలు అదుపులోకి రాకపోతే బావి మూసివేతకు ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ONGC Pipeline Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు బ్లో అవుట్ కొనసాగుతున్నాయి. మల్కిపురం మండలం ఇరుసుమండలోని బావిలో నుంచి భారీగా లీక్ కావడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో ఈరోజు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. వాటర్ అంబరిల్లాలతో నాలుగు వైపుల నుంచి నీళ్లు విరజిమ్మి మంటలు అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పైపులను నరసాపురం నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 16 గంటలుగా ఏకధాటిగా బ్లో అవుట్ కొనసాగుతుంది.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య.. 24 గంటల్లో రెండో ఘటన
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
అయితే, అవసరమైన పైప్ లైన్లను ఇతర సామాగ్రిని రాజమండ్రి, నరసాపురం నుంచి ఓఎన్జీసీ అధికారులు తీసుకుని వస్తున్నట్లు తెలుస్తుంది. ఘటన స్థలానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఇక, కోనసీమను చమురు, సహజ వాయు నిక్షేపాలు వెలికితీత నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. తరచూ బ్లూ అవుట్స్ స్థానిక ప్రజలకు భయ పెడుతున్నాయి. రాజోలు మండలం తూర్పుపాలెంలో కొమరాడ 1 డ్రిల్లింగ్ సైట్ లో 1993 మార్చి 20వ తేదీన బ్లో అవుట్ ఏర్పడింది. మంటలు వ్యాపించడంతో వేల కొబ్బరి చెట్లు దగ్ధమైయ్యాయి. 26 రోజులు తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్ తో బావి మూసివేశారు.
Read Also: Mana Shankar Varaprasad Garu: మన శంకర్ వరప్రసాద్ గారు… దుమ్ము రేపేస్తున్నారు
అలాగే, 1995 జనవరి 8వ తేదీన డ్రిల్లింగ్ సమయంలో బ్లో అవుట్ రావడంతో అల్లవరం మండలంలోని దేవరలంక పాశర్లపూడి 19 బావిలో 65 రోజులు పాటు మంటలు ఎగసిపడ్డాయి, అనంతరం బీఓపీ మూసివేసేశారు. 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ బ్లో అవుట్ కారణంగా ఆరు రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక, 2014 జూన్ 27వ తేదీన మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ కి చెందిన ట్రంక్ లైన్ లో విస్పోటనం చెందడంతో 22 మంది మృతి చెందగా, 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడిలో డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ పేలుడుతో మూడు రోజులు తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!