Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో అంబటి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు (polavaram project) వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. గోదావరి వరద (godavari floods) పెరిగితే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో బుధవారం సీఎం జగన్ కూడా పర్యటించారు. అక్కడి బాధితులకు భరోసా కల్పించారు. కేంద్రంపై వత్తిడి తెచ్చి పరిహారం త్వరగా వచ్చేలా చూస్తామంటున్నారు. ఇదిలా వుంటే.. పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ కోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) .. ఆ భేటీ అనంతరం మరో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలులను వెంటబెట్టుకుని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ను అంబటి రాంబాబు కలిశారు.
Arpita Mukherjee: మళ్లీ భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు..! నా ఇంట్లో ఛటర్జీ డబ్బులు దాచేవారు..
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ఈ సందర్భంగా తన సొంత జిల్లా పల్నాడు జిల్లాలోని వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని రాంబాబు కోరారు. పల్నాడు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రాంబాబు విన్నవించారు. దీనికి సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్ చేశారు. పల్నాడులో ఎంతో ప్రాధాన్యత ఉన్న వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భుపిందర్ యాదవ్ గారిని, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు, ఎంపీ మిథున్రెడ్డి గారు, నేను ఢిల్లీలో ఈరోజు కోరడం జరిగిందన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పోలవరానికి సంబంధించి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..