Amaravati Farmers: ఢిల్లీ వెళ్లిన అమరావతి రైతులు.. జంతర్ మంతర్ వద్ద నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers Going To Delhi For AP Capital Issue: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే నినాదాన్ని ఎలుగెత్తి చాటేందుకు అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్లారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన వీళ్లు.. డిసెంబర్ 17, 18వ తేదీల్లో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. మొత్తం 1580 మంది రైతులు ఈ నిరసన దీక్షలో పాల్గొననున్నారు. అంతేకాదు.. మూడు రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టి, అమరావతి ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం జగన్ మూడు రాజధానుల్ని ప్రకటించి డిసెంబర్ 17వ తేదీ నాటికి మూడేళ్లు అవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ ఢిల్లీ యాత్ర చేపట్టారు. ఈ నెల 21వ తేదీన రైతులు తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.
కాగా.. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రాజధాని రైతులు వెయ్యి రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! రాజధాని గ్రామాల్లో రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు.. తమ గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించాలని పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన ఈ రైతులు.. శుక్రవారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఈ ఢిల్లీ యాత్రకు అన్ని రాజకీయపార్టీలు, ప్రజా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.
Also Read
అటు.. ఢిల్లీ చేరుకున్న తర్వాత రైతులు 17న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. 18న ఐకాస నేతలు, రైతులు బృందాలుగా విడిపోయి.. జాతీయపార్టీల అధినేతలు, ఎంపీలను కలిసి.. అమరావతి ఆవశ్యకతతోపాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని రైతులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!