Amaravati Farmers: ఢిల్లీ వెళ్లిన అమరావతి రైతులు.. జంతర్ మంతర్ వద్ద నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers Going To Delhi For AP Capital Issue: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే నినాదాన్ని ఎలుగెత్తి చాటేందుకు అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్లారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన వీళ్లు.. డిసెంబర్ 17, 18వ తేదీల్లో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. మొత్తం 1580 మంది రైతులు ఈ నిరసన దీక్షలో పాల్గొననున్నారు. అంతేకాదు.. మూడు రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టి, అమరావతి ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం జగన్ మూడు రాజధానుల్ని ప్రకటించి డిసెంబర్ 17వ తేదీ నాటికి మూడేళ్లు అవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ ఢిల్లీ యాత్ర చేపట్టారు. ఈ నెల 21వ తేదీన రైతులు తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.
కాగా.. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రాజధాని రైతులు వెయ్యి రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! రాజధాని గ్రామాల్లో రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు.. తమ గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించాలని పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన ఈ రైతులు.. శుక్రవారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఈ ఢిల్లీ యాత్రకు అన్ని రాజకీయపార్టీలు, ప్రజా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
అటు.. ఢిల్లీ చేరుకున్న తర్వాత రైతులు 17న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. 18న ఐకాస నేతలు, రైతులు బృందాలుగా విడిపోయి.. జాతీయపార్టీల అధినేతలు, ఎంపీలను కలిసి.. అమరావతి ఆవశ్యకతతోపాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని రైతులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!