Amaravati Farmers: ఢిల్లీ వెళ్లిన అమరావతి రైతులు.. జంతర్ మంతర్ వద్ద నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers Going To Delhi For AP Capital Issue: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే నినాదాన్ని ఎలుగెత్తి చాటేందుకు అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్లారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన వీళ్లు.. డిసెంబర్ 17, 18వ తేదీల్లో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. మొత్తం 1580 మంది రైతులు ఈ నిరసన దీక్షలో పాల్గొననున్నారు. అంతేకాదు.. మూడు రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టి, అమరావతి ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం జగన్ మూడు రాజధానుల్ని ప్రకటించి డిసెంబర్ 17వ తేదీ నాటికి మూడేళ్లు అవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ ఢిల్లీ యాత్ర చేపట్టారు. ఈ నెల 21వ తేదీన రైతులు తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.
కాగా.. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రాజధాని రైతులు వెయ్యి రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! రాజధాని గ్రామాల్లో రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు.. తమ గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించాలని పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన ఈ రైతులు.. శుక్రవారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఈ ఢిల్లీ యాత్రకు అన్ని రాజకీయపార్టీలు, ప్రజా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
అటు.. ఢిల్లీ చేరుకున్న తర్వాత రైతులు 17న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. 18న ఐకాస నేతలు, రైతులు బృందాలుగా విడిపోయి.. జాతీయపార్టీల అధినేతలు, ఎంపీలను కలిసి.. అమరావతి ఆవశ్యకతతోపాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని రైతులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?