YV Subba Reddy: టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారింది..
- టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారింది- వైవీ సుబ్బారెడ్డి
- జగన్ జైలుకు వెళ్ళటానికి కాంగ్రెస్.. టీడీపీ పెట్టిన అక్రమ కేసులు కారణం- సుబ్బారెడ్డి
- ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణ చేసి ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది- సుబ్బారెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారిందని వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ జైలుకు వెళ్ళటానికి కాంగ్రెస్, టీడీపీ పెట్టిన అక్రమ కేసులు కారణం అని అన్నారు. ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణ చేసి ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది.. ట్రాన్స్ఫర్ చేయద్దు అని హైకోర్టు చెప్పినా షేర్లు ట్రాన్స్ఫర్ చేసారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంటే టీడీపీ కుట్రలో మనం కూడా భాగం అయ్యామని అనిపిస్తోంది.. వాస్తవాలు చెప్పేందుకు జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారన్నారు. అంతే తప్పా.. తల్లి, చెల్లి పై కేసులు వేయాలని దురుద్దేశం మాత్రం కాదని తెలిపారు.
Kolusu Parthasarathy: అన్ని పాలసీలతో 30 లక్షల కోట్ల పెట్టుబడి, 20 లక్షల ఉద్యోగాలు కల్పన..
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయకపోతే మళ్ళీ ఇదే టీడీపీ నేతలు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేస్తారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. షర్మిలకు మేలు చేయాలని ప్రేమ అభిమానంతో మాత్రమే జగన్ ఎంవోయూ చేశారు.. కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకుని సంతకాలు చేశారని తెలిపారు. జగన్ సొంత ప్రాపర్టీలు అని స్పష్టంగా డాక్యుమెంట్స్లో ఉంది.. వైఎస్సార్ బ్రతికి ఉన్న సమయంలోనే జగన్, షర్మిలకు ప్రాపర్టీలను కేటాయించారని అన్నారు. ఆస్తులు పెంచటంలో షర్మిల పాత్ర ఎక్కడా ఉన్నట్టు తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఆస్తుల్లో షర్మిల వాటా ఉంటే ఈడీ ఎందుకు షర్మిలపై కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. కేవలం జగన్ పై మాత్రమే కేసులు ఈడీ పెట్టిందని అన్నారు.
Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..
డివిడెండ్గా రూ. 200 కోట్లు ఇచ్చారని షర్మిల అనటం సరికాదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సంస్థలో డైరెక్టర్గా ఉన్న జగన్ చెల్లి షర్మిలకు ఇచ్చినది తప్ప డివిడెండ్ కాదు.. జగతి, భారతి సిమెంట్స్ జగన్ డెవలప్ చేసిన ఆస్తులని అన్నారు. జగన్ సంస్థల్లో సమాన వాటాలు ఇవ్వాలని వైఎస్ఆర్ అనుకుంటే.. అప్పుడే షర్మిల లేదా ఆమె భర్త అనిల్లను డైరెక్టర్గా పెట్టేవారు కదా అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ చెప్పి ఉంటే జగన్ వారి పేర్లు పెట్టే వారు.. 2014, 2024లో ఒక్క అబద్ధం చెబితే అధికారంలోకి వస్తామని చెప్పినా ఆయన అబద్ధం చెప్పలేదన్నారు. అలాంటి జగన్ ఈ విషయంలో ఎందుకు మాట తప్పుతారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!