Ex IAS Officer Imtiaz: వైసీపీకి మరో షాక్..! రాజకీయాలకు మాజీ ఐఏఎస్ గుడ్బై..
- వైసీపీ మరో షాక్..
- వైసీపీ, రాజకీయాలకు మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ గుడ్ బై..
- ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఇంతియాజ్..
- రాజకీయాలకు దూరం అవుతున్నా.. కానీ, ప్రజసేవ రంగానికి కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex IAS Officer Imtiaz: ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతూ వస్తున్నాయి.. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది పార్టీని వీడారు.. కూటమి పార్టీలో చేరుతున్నారు.. అయితే, తాజాగా వైసీపీ మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు.. అంటే, ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. మొత్తం రాజకీయాలకే గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.. గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.. ఇక, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ విడుదల చేసిన రాజీనామా లేఖను ఓసారి పరిశీలిస్తే..
Read Also: Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
Also Read
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
“అందరికీ నమస్కారం.. కొన్ని నెలల క్రితం ప్రజాసేవే ధ్యేయంగా, ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్న పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ సర్వీస్ నుండి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందే.. గత కొంత కాలంగా బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులతో చర్చించ ఒక నిర్ణయానికి రావడం జరిగింది.. అదేమిటంటే.. రాజకీయ రంగం నుడి దూరంగా జరగటం.. రాజకీయాలకు దూరం అవుతున్నాను.. కానీ ప్రజసేవ రంగానికి కాదు” అని పేర్కొన్నారు..
Read Also: IND Women vs WI Women: దీప్తి శర్మ ఆల్రౌండర్ షో.. వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
ఇక, “ఇప్పుడు ఒక రిటైర్డ్ ఏఐఎస్ అధికారిగా, సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా మరియు సాహితీవేత్తగా ఒక మెరుగైన సమాజం కోసం, నా వంతు కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నాను.. గత ఆరు నెలల కాలంలో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా కర్నూలు నగర వాసులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. రాబోయే రోజుల్లో సామాజిక అసమానతలను, రుగ్మతులను రూపుమాసేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ఆ దిశగా పని చేసే స్వచ్ఛంద సంస్థలతో, వ్యక్తులతో పని చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది..” అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్.. అయితే, గతంలోనూ కొందరు నేతలు వైసీపీ రాజీనామా చేసి.. కొంతకాలం సైలెంట్గా ఉన్నారు.. ఆ తర్వాత కూటమి పార్టీల్లో చేరారు.. మరి.. ఇంతియాజ్.. రాజకీయాలకు దూరంగానే ఉంటారా? తన మదిలో ఇంకా ఏదైనా ఆలోచనా ఉందా? అనేది వేచిచూడాలి..
తాజావార్తలు
-
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
-
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
-
Peddi: సెకండ్ వీకెండ్లోనూ తగ్గని జోరు.. బుక్మైషోలో రికార్డుల వేట!
-
US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
-
West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!