IND Women vs WI Women: దీప్తి శర్మ ఆల్రౌండర్ షో.. వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
- దీప్తి శర్మ ఆల్రౌండర్ షో..
- 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
- సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Women vs WI Women: టీమిండియా, వెస్టిండీస్ మహిళల మధ్య వడోదరలో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడించి, సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో మొదట బౌలింగ్ చేసిన భారత జట్టు, వెస్టిండీస్ను కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తరువాత, భారత బ్యాట్స్మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలో ఛేదించారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్లో అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. దాంతో ఆమెను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంది.
Also Read: Parenting Tips: పిల్లలతో ఇలా ఉంటే చిన్నప్పటి నుండే సక్రమ మార్గంలో పయనిస్తారు
Also Read
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మలు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసి, జట్టు మొత్తాన్ని 162 పరుగులకే పరిమితం చేశారు. మొదటి బంతికే వెస్టిండీస్కు రేణుకా షాక్ ఇచ్చింది. 9 పరుగుల వద్ద మూడో వికెట్ పడగొట్టిన రేణుకా ఆ తర్వాత కరీబియన్ జట్టును కంట్రోల్ చేయడం కొనసాగించింది. ఆ తర్వాత దీప్తి శర్మ మిగిలిన వికెట్లను వరుసబెట్టి 10 ఓవర్లలో 31 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది.
Also Read: Chayote Health Benefits: సీమ వంకాయ గురించి విన్నారా.. తింటే ఇన్ని లాభాలా?
ఇక భారత బ్యాటింగ్ ప్రారంభంలో కొన్ని వికెట్లు కోల్పోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (32), జెమిమా రోడ్రిగ్స్ (29) నెమ్మదిగా పరుగులు సాధించారు. దీప్తి శర్మ 48 బంతుల్లో 39 పరుగులు చేసి, రిచా ఘోష్ 11 బంతుల్లో 23 పరుగులు చేసిన తర్వాత భారత్ ఈ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ తో భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్లో భారత్ మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. మొదటి మ్యాచ్లో భారత్ 211 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్లో 115 పరుగుల తేడాతో విజయం సాధించగా, మూడో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేణుకా సింగ్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మొత్తం 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా భారత్ వెస్టిండీస్పై 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!