AP Secretariat: సచివాలయంలో వైసీపీ కోవర్టులు..! ప్రక్షాళన చేపట్టిన సీఎస్.. వారికి స్థాన చలనం
- సచివాలయంలో వైసీపీ కోవర్టులు ఉన్నారని సమాచారం..
- కేబినెట్ సమావేశంలోనూ కోవర్టులపై చర్చ..
- కోవర్టుల పనిపట్టాలని సీఎస్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
- ముఖ్య శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పించిన సీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Secretariat: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ముఖ్య శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్.. అయితే, సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారని.. ఎప్పటికప్పుడు సచివాలయంలో జరుగుతోన్న పరిణామాలను వైసీపీకి చేరవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గత కేబినెట్ సమావేశంలోనూ చర్చ సాగింది.. సచివాలయంలో ఉన్న వైసీపీ కోవర్టుల సంగతి చూడాలంటూ కేబినెట్ సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. దీంతో.. చర్యలకు దిగిన సీఎస్.. వివిధ శాఖల్లో ఏఎస్, డీఎస్, జేఎస్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రీ-షఫుల్ చేశారు.. మొత్తంగా 13 మంది సచివాలయ ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది.. ఇక, ఆ 13 మందిలో ఆరుగురిని జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్.
Read Also: SS Rajamouli: సెప్టెంబరు 13న టికెట్లు తస్కరించేందుకు అంతా సిద్ధం.. రాజమౌళి ట్వీట్ వైరల్!
Also Read
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
కాగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి.. ఇప్పటికీ బదిలీలు కొనసాగుతోన్న విషయం విదితమే కాగా.. సచివాలయంలోనూ ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.. కోవర్టులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతోన్న సమయంలో.. ఈ బదిలీలు.. జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి..
తాజావార్తలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!