YS Jagan: బాలినేని ఎఫెక్ట్..! ప్రకాశం జిల్లా నేతలతో జగన్ భేటీ..
- జనసేనలో చేరేందుకు రెడీ అయిన బాలినేని..
- అలర్ట్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్..
- ఇవాళ ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలు.. ముఖ్య నేతలతో భేటీ..
- పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్బై చెప్పడం చర్చగా మారింది.. ఇదే సమయంలో.. ఆయన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలవడం.. త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్టు కూడా ప్రకటించారు.. అయితే, బాలినేని వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంఛార్జ్లను మార్పులు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది..
Read Also: CM Chandrababu: శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారు..
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి.. పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారు పార్టీ అధినేత వైఎస్ జగన్.. బాలినేని వెంట ముఖ్య నేతలు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.. కాగా, బుధవారం రోజు వైసీపీకి గుడ్బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. శుక్రవారం రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు.. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు. ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చానని చెప్పారు. తనతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారు.. అందరూ రాజీనామాలు చేసి అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు. వైఎస్ మీద ప్రేమతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైసీపీలోనే ఉన్నానని.. గతంలోనే పవన్.. వైసీపీలో బాలినేని లాంటి మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల ముందు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జనసేనలో చేరలేకపోయానని బాలినేని అన్నారు. ఏ డిమాండ్స్ లేకుండానే జనసేన పార్టీలో చేరుతున్నా.. కూటమి నేతలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక, ఈ సందర్భంగా వైఎస్ జగన్పై బాలినేని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిపోయిన విషయం విదితమే..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!