YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా?
- తక్కువ ఆదాయం రావడమే సంపద సృష్టా?
- కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరును మాజీ సీఎం వైఎస్.జగన్ ఎండగట్టారు. సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. గత రెండేళ్ల రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుందంటూ ఫైరయ్యారు. కాగ్ విడుదల చేసిన 2025-26 తాత్కాలిక లెక్కల్లో అసల నిజాలు బహిర్గతమయ్యాయని ధ్వజమెత్తారు. ఒకవైపు 2025-26లో రాష్ట్ర GSDP వృద్ధి రేటు 10.75 శాతం అంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని.. మరోవైపు దానికి పూర్తిగా భిన్నంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3.22 శాతం పడిపోయిన రాష్ట్ర పన్ను రాబడులు.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు, వినియోగం పెరిగి పన్ను వసూళ్లు ఎక్కువగా ఉండాలి కదా? అని ప్రశ్నించారు.
‘‘కానీ ప్రస్తుత ప్రభుత్వంలో 2025-26 బడ్జెట్ అంచనాల కంటే పన్ను రాబడులు -3.22 శాతానికి క్షీణించాయి. పన్ను రాబడులు నిజంగా 9.60 శాతం పెరిగి ఉంటే.. ప్రభుత్వం చెప్తున్న 10.75 శాతం GSDP వృద్ధిని నమ్మవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది మాత్రం తిరోగమనమే కనిపిస్తుంది. గత ప్రభుత్వ చివరి ఏడాది 2023-24 లో రాష్ట్ర పన్ను రాబడులు రూ. 85,922.23 కోట్లు.. రెండేళ్ల తర్వాత కనీసం 8 శాతం సాధారణ వృద్ధి రేటు ఉన్నా.. 2025-26 నాటికి పన్ను రాబడులు రూ. 1,00,219.69 కోట్లకు చేరాలి.. కానీ 2025-26లో వచ్చిన రాబడి కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమే..
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అంచనా ఆదాయ నష్టం అక్షరాలా రూ. 13,667 కోట్లు. చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా? కనీస వృద్ధి కంటే రూ. 13,667 కోట్ల తక్కువ ఆదాయం రావడమే సంపద సృష్టా?.’’ అని నిలదీశారు.
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
‘‘మే 2025లో APMDC ద్వారా NCDల జారీతో సేకరించిన రూ. 9,000 కోట్లను ప్రభుత్వం రోజువారీ ఖర్చులకే వాడేసింది. ఈ రూ. 9,000 కోట్ల బాండ్ల నిధులతో ఎలాంటి ఆస్తుల సృష్టి జరగలేదు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రైవేట్ NCD హోల్డర్లకు రాష్ట్ర సంచిత నిధి యాక్సెస్ కల్పించారు. ఈ రూ. 9,000 కోట్ల నిధులను 2025-26 ఖాతాల్లో పన్నేతర ఆదాయంగా చూపించారు.గత రెండేళ్లుగా పాలనా వర్గాలు, అవినీతి వల్ల స్పష్టమైన ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది. డైవర్షన్ రాజకీయాల కోసమే వేగవంతమైన వృద్ధి అంటూ కట్టుకథలు చెబుతున్నారు. అప్పులు సేకరించడం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులను అవలంబిస్తున్నారు.’’ అని వైఎస్.జగన్ రాసుకొచ్చారు.
𝟮 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗶𝗻𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗲𝘃𝗲𝗿𝗲 𝗳𝗶𝘀𝗰𝗮𝗹 𝘀𝘁𝗿𝗲𝘀𝘀
The provisional accounts for the financial year 2025-26 have been published by the CAG, these accounts bring to light unsettling facts regarding the State.
On one hand Mr. Chandrababu… pic.twitter.com/jyQe6sUJVv
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 16, 2026
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!