YS Jagan on AP Capital: రాజధానిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ఎక్కడా లేదు..!
- రాజధానిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు..
- ప్రభుత్వం ఎక్కడ కూర్చుని పని చేస్తుంటే అదే రాజధాని..
- సీట్, మంత్రులు, అధికారులు అందరూ అక్కడి నుంచే పాలన చేస్తారు..
- పాలనా వ్యవస్థ మొత్తం అక్కడి నుంచే నడుస్తుంది..
- నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan on AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎవరి వాదన వారిదిగా ఉంది.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానంటూ వైఎస్ జగన్ ప్రకటించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడమే కాదు.. కొత్త అవసరాలకు అనుగుణంగా మళ్లీ భూసమీకరణ చేపట్టింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో ప్రత్యేక నిర్వచనం లేదని, భారత రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం ఎక్కడి నుంచి పని చేస్తే.. అదే ఆ రాష్ట్ర రాజధాని” అని పేర్కొన్న జగన్.. శాసనసభ, మంత్రులు, అధికారులు అందరూ అక్కడి నుంచే పాలన సాగిస్తారని, పాలనా వ్యవస్థ మొత్తం అక్కడి నుంచే నడుస్తుందన్నదే రాజధాని అసలైన అర్థం అని వివరించారు.
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
అసలు, నదీ పరివాహకంలో రాజధాని నిర్మాణం సరికాదు అన్నారు వైఎస్ జగన్.. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. నదీ పరివాహక (River Basin) ప్రాంతంలో రాజధాని నగరం నిర్మించాలనుకోవడం సరికాదని, రివర్ బేసిన్లో భవనం కట్టడానికే సాధారణంగా అనుమతి ఉండదని, అలాంటి ప్రాంతంలో మొత్తం నగర నిర్మాణం చేపట్టాలనుకోవడం ప్రమాదకరమైన, అవివేకమైన నిర్ణయం అని విమర్శించారు వైఎస్ జగన్.
అమరావతి అనువైన ప్రదేశం కాదు
అమరావతి భౌగోళికంగా, మౌలికంగా రాజధానికి అనువైన ప్రాంతం కాదని అన్నారు వైఎస్ జగన్.. విజయవాడ, గుంటూరు నగరాలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని, విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు లేని ప్రాంతమని, రోడ్లు, పవర్, వాటర్ కనీస అవసరాలే లేని చోట రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు. ఇక, “రివర్ బేసిన్లో భవనాల నిర్మాణానికే అనుమతులు ఉండవు.. అలాంటిది నగరం నిర్మిస్తామనడం సరికాదు” అంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సౌకర్యం, భద్రత, అభివృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్ణయం ఉండాలని, పాలనా కేంద్రం ఎక్కడి నుంచి సమర్థంగా పనిచేస్తుందో అదే రాజధానిగా గుర్తించబడుతుందని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!