YS Jagan: తిరోగమనం వైపు ఏపీ.. ధ్వజమెత్తిన జగన్
- రాష్ట్రం తిరోగమనంలో ఉందని విమర్శించిన జగన్..
- గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి..
- ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్నాయన్న మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాష్ట్రం తిరోగమనంలో ఉంది.. గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి.. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉంది అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లు, సాండ్ స్కామ్లు కనపడుతున్నాయి.. పేకాట క్లబ్లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది.. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పాదయాత్రలో నేను గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను.. DBT ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం.. అవినీతికి తావులేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం.. 2.73 లక్షల కోట్లు DBT ద్వారా అవినీతి, వివక్ష లేకుండా మేం ఇచ్చామని గుర్తుచేసుకున్నారు జగన్..
Read Also: Viral video : అమ్మాయిలతో పాటు భరతనాట్యం చేసిన ఏనుగు.. వీడియో వైరల్
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
అయితే, మళ్లీ ఇప్పుడు జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. విద్య, వైద్య శాఖలో అనేక మార్పులు వైసీపీ హయంలో వచ్చాయి.. ఇప్పుడు అన్నీ వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయని విమర్శించారు.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో చేయటం లేదన్న ఆయన.. రైతుల నుంచి దళారీలు ధాన్యం కొంటున్నారు.. 3 క్వార్టర్స్ పూర్తయినా విద్యా దీవెన బకాయిలు చెల్లించటం లేదు.. కళాశాలలో చదవాల్సిన విద్యార్థులు పొలాల్లో తల్లిదండ్రులతో ఉంటున్నారని మండిపడ్డారు.. వాలంటీర్లను మోసం చేశారు.. ఎన్నికల సమయంలో 10 వేలు ఇస్తామని గెలిచాక పక్కన పెట్టేశారని దుయ్యబట్టారు.. సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయం పెంచే విధానం.. వైసీపీ హయంలో ఇది జరిగింది.. 3 పోర్టులను ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం అన్నారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణం చేస్తోందంటూ ఆరోపించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!