YS Jagan: అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. ఇది శుభపరిణామం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అద్దంకి గెలవగల నియోజకవర్గమే
అద్దంకి నియోజకవర్గం గెలవలేనిది కాదని స్పష్టం చేశారు వైఎస్ జగన్.. ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. జగన్ అమలు చేసిన పథకాలను రద్దు చేసి, తాను ప్రకటించిన “సూపర్ సిక్స్”, “సూపర్ సెవెన్” హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
పునర్విభజనపై జగన్ స్పందన
నియోజకవర్గాల పునర్విభజనను శుభపరిణామంగా అభివర్ణించారు వైఎస్ జగన్… మహిళలకు రిజర్వేషన్లు పెరగడం సంతోషకరమని తెలిపారు. తమ పాలనలోనే మహిళలకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. కొత్త సీట్ల పెరుగుదలతో పార్టీ కార్యకర్తలకు నాయకత్వ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
అప్పులు, సంక్షేమంపై వివరణ
తమ ప్రభుత్వ కాలంలో చేసిన అప్పులపై కూడా జగన్ వివరణ ఇచ్చారు. ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.2.72 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయని తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల ఆధారంగా ప్రతి రూపాయి ఎవరికి ఇచ్చామో చెప్పగలమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల లోపే రూ.3.37 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఇక, ప్రస్తుత పాలనలో అవినీతి విస్తృతంగా పెరిగిందని జగన్ ఆరోపించారు. లిక్కర్, ఇసుక, మట్టి, సిలికా, గ్రానైట్ రంగాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. అమరావతి నిర్మాణాల్లో కూడా భారీ అవినీతి జరుగుతోందని, చదరపు అడుగుకు అధిక ఖర్చులు చూపుతున్నారని పేర్కొన్నారు.
పెట్టుబడులపై క్రెడిట్ దోపిడీ ఆరోపణ
పెట్టుబడుల విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్ దోపిడీ చేస్తోందని జగన్ అన్నారు. ArcelorMittal స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వాటిని ప్రస్తుత ప్రభుత్వం తమదిగా చూపిస్తోందని విమర్శించారు. అలాగే గూగుల్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, మొక్కజొన్న, శెనగ, అరటి, టమోటా వంటి పంటలకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు చదువులు మానేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని పేర్కొన్నారు.
కార్యకర్తలకు భరోసా
“జగన్ 2.0”లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తంగా, అద్దంకి సమావేశంలో జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై సంకేతాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!