Vidadala Rajini Strong Warning: మాపై దాడి చేసి తిరిగి మా పైనే కేసులా?.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి..!
రాష్ట్రంలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని.. తిరుమల లడ్డూ విషయంలో క్షమాపణ చెప్పమన్నందుకు సీఎం చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి ఆర్గనైజ్డ్ గా టీడీపీ వాళ్లతో దాడి చేయించారు.. కార్యకర్తలను అంబటి ఇంటి మీదకు తీసుకెళ్లారు.. మళ్లీ వస్తాం.. మల్లా కొడతాం అని ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో చూసుకోండి.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది అది గుర్తుంచుకోండి అని హెచ్చరించారు..
Read Also: PM Modi: వారం వ్యవధిలో మోడీ రెండు బిగ్ డీల్స్.. భారత్కు కలిసొచ్చేదెంత?
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
ఎంపీ పెమ్మసాని 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటు వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విడదల రజని.. తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని సీబీఐ చెప్పింది.. ఈ విషయంలో అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు బుద్ధి మారాలని పూజలు చేసేందుకు వెళ్లాం.. అక్కడ నాతో పాటు మా పార్టీ కార్యకర్తలపై చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దాడి చేయించారు.. మాపై దాడి చేసి తిరిగి నామీదే కేసులు పెట్టారు. గుడి దగ్గర కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, అక్కడకు వచ్చిన వారిపై దాడి చేశామని ఫిర్యాదు చేశారు అని మండిపడ్డారు.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు.. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ చట్టాలను చేతిలోకి తీసుకున్నారు. రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్లు, సామాన్యులు ఏ గుళ్లకు వెళ్లవద్దని చట్టం చేయండి.. లడ్డూలో జరగని దానిని జరిగిందని ఫ్లెక్సీలు వేసి ఈ రభసకు కారణం అయ్యారు.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయటం, పెట్రోల్ బాంబులు వేయటం, మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారు అని విమర్శించారు.. బీసీ మహిళను అయిన నా మీద అనేక సార్లు దాడులు చేశారు.. ఒక మహిళా మాజీ మంత్రిని అయిన నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు..! అని ఫైర్ అయ్యారు.. మీరు ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటాం.. మీరు ఆ పని చేయకపోతే ప్రశ్నిస్తాం అన్నారు.. నెయ్యి విషయంలో వైసీపీ హయంలో ఏ తప్పు చేయలేదు.. మీరే ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లి వారి మనోభావాలు దెబ్బతీశారు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేలడంతో జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి విడదల రజని..
తాజావార్తలు
-
Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!