Vidadala Rajini Strong Warning: మాపై దాడి చేసి తిరిగి మా పైనే కేసులా?.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని.. తిరుమల లడ్డూ విషయంలో క్షమాపణ చెప్పమన్నందుకు సీఎం చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి ఆర్గనైజ్డ్ గా టీడీపీ వాళ్లతో దాడి చేయించారు.. కార్యకర్తలను అంబటి ఇంటి మీదకు తీసుకెళ్లారు.. మళ్లీ వస్తాం.. మల్లా కొడతాం అని ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో చూసుకోండి.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది అది గుర్తుంచుకోండి అని హెచ్చరించారు..
Read Also: PM Modi: వారం వ్యవధిలో మోడీ రెండు బిగ్ డీల్స్.. భారత్కు కలిసొచ్చేదెంత?
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
ఎంపీ పెమ్మసాని 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటు వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విడదల రజని.. తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని సీబీఐ చెప్పింది.. ఈ విషయంలో అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు బుద్ధి మారాలని పూజలు చేసేందుకు వెళ్లాం.. అక్కడ నాతో పాటు మా పార్టీ కార్యకర్తలపై చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దాడి చేయించారు.. మాపై దాడి చేసి తిరిగి నామీదే కేసులు పెట్టారు. గుడి దగ్గర కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, అక్కడకు వచ్చిన వారిపై దాడి చేశామని ఫిర్యాదు చేశారు అని మండిపడ్డారు.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు.. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ చట్టాలను చేతిలోకి తీసుకున్నారు. రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్లు, సామాన్యులు ఏ గుళ్లకు వెళ్లవద్దని చట్టం చేయండి.. లడ్డూలో జరగని దానిని జరిగిందని ఫ్లెక్సీలు వేసి ఈ రభసకు కారణం అయ్యారు.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయటం, పెట్రోల్ బాంబులు వేయటం, మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారు అని విమర్శించారు.. బీసీ మహిళను అయిన నా మీద అనేక సార్లు దాడులు చేశారు.. ఒక మహిళా మాజీ మంత్రిని అయిన నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు..! అని ఫైర్ అయ్యారు.. మీరు ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటాం.. మీరు ఆ పని చేయకపోతే ప్రశ్నిస్తాం అన్నారు.. నెయ్యి విషయంలో వైసీపీ హయంలో ఏ తప్పు చేయలేదు.. మీరే ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లి వారి మనోభావాలు దెబ్బతీశారు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేలడంతో జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి విడదల రజని..
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!