Vidadala Rajini Strong Warning: మాపై దాడి చేసి తిరిగి మా పైనే కేసులా?.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని.. తిరుమల లడ్డూ విషయంలో క్షమాపణ చెప్పమన్నందుకు సీఎం చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి ఆర్గనైజ్డ్ గా టీడీపీ వాళ్లతో దాడి చేయించారు.. కార్యకర్తలను అంబటి ఇంటి మీదకు తీసుకెళ్లారు.. మళ్లీ వస్తాం.. మల్లా కొడతాం అని ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో చూసుకోండి.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది అది గుర్తుంచుకోండి అని హెచ్చరించారు..
Read Also: PM Modi: వారం వ్యవధిలో మోడీ రెండు బిగ్ డీల్స్.. భారత్కు కలిసొచ్చేదెంత?
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఎంపీ పెమ్మసాని 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటు వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విడదల రజని.. తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని సీబీఐ చెప్పింది.. ఈ విషయంలో అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు బుద్ధి మారాలని పూజలు చేసేందుకు వెళ్లాం.. అక్కడ నాతో పాటు మా పార్టీ కార్యకర్తలపై చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దాడి చేయించారు.. మాపై దాడి చేసి తిరిగి నామీదే కేసులు పెట్టారు. గుడి దగ్గర కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, అక్కడకు వచ్చిన వారిపై దాడి చేశామని ఫిర్యాదు చేశారు అని మండిపడ్డారు.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు.. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ చట్టాలను చేతిలోకి తీసుకున్నారు. రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్లు, సామాన్యులు ఏ గుళ్లకు వెళ్లవద్దని చట్టం చేయండి.. లడ్డూలో జరగని దానిని జరిగిందని ఫ్లెక్సీలు వేసి ఈ రభసకు కారణం అయ్యారు.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయటం, పెట్రోల్ బాంబులు వేయటం, మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారు అని విమర్శించారు.. బీసీ మహిళను అయిన నా మీద అనేక సార్లు దాడులు చేశారు.. ఒక మహిళా మాజీ మంత్రిని అయిన నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు..! అని ఫైర్ అయ్యారు.. మీరు ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటాం.. మీరు ఆ పని చేయకపోతే ప్రశ్నిస్తాం అన్నారు.. నెయ్యి విషయంలో వైసీపీ హయంలో ఏ తప్పు చేయలేదు.. మీరే ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లి వారి మనోభావాలు దెబ్బతీశారు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేలడంతో జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి విడదల రజని..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!