Rajya Sabha Election: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు..? రేస్లో ఉన్న బీజేపీ నేతలు వీళ్లేనా..?
- ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ..
- 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..
- పొత్తులో భాగంగా బీజేపీకి రాజ్యసభ సీటు వదిలేసిన కూటమి..
- బీజేపీ నుంచి బరిలోకి దిగేది ఎవరు? అనేదానిపై ఉత్కంఠ..
- ఏపీతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న నేతల పేర్లు..
Rajya Sabha Election: ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.. ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్ ఎవరూ వేయలేదు. దీంతో ఏపీ నుంచి ఎవరికీ రాజ్యసభ స్థానం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది… అయితే, కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పందం జరిగింది.. దీంతో బీజేపీ నుంచి కొన్ని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి..
Read Also: Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు..
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
రాజ్యసభ రేస్లో ఏపీ బీజేపీ నుంచి మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.. అయితే, బీజేపీ ఇతర రాష్ట్రాల అభ్యర్థుల పేర్లు ప్రధానంగా పరిశీలిస్తోంది.. వీరిలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ప్రధానంగా ఉంది.. ఆల్రెడీ అన్నామలైకి రాజ్యసభ స్థానం ఇస్తున్నారు అనే ప్రచారం కూడా బాగా జరిగింది.. కానీ, మధ్యలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా రాజ్యసభ సీటును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అడిగినట్లుగా సమాచారం.. కానీ, బీజేపీకి డిసైడ్ అవ్వడంతో బీజేపీ లిస్టులో ఎవరున్నారో.. వారికే సీటు వచ్చే అవకాశం కనిపిస్తోంది..
Read Also: Madhya Pradesh: కునో నేషనల్ పార్క్ లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత నిర్వా
అయితే ప్రస్తుతం రాజ్యసభ సీటు తీసుకున్న వాళ్లకి బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కూడా అవకాశం వస్తుందనే చర్చ జరుగుతోంది… 2014-19 మధ్యలో ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా సురేష్ ప్రభు కేంద్ర కేబినెట్లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చేవారికి కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కవచ్చనేది సమాచారం.. అందుకే ఇతర రాష్ట్రాల వారికి ప్రధానంగా బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఏపీలో కొన్ని పేర్లు పరిశీలించినా తమిళనాడు నుంచి అనామలైకి ప్రధానంగా ఈ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నామినేషన్ గడువు రేపటితో ముగుస్తుంది. వచ్చే నెల 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.. ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా ఎవరిని ఖరారు చేయకపోవడంతో ఎవరి పేరు ప్రకటించవచ్చు అనే చర్చ మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది.. ఇవాళ సాయంత్రం లోగా అధికారిక ప్రకటన బీజేపీ నుంచి రాబోతోంది..
తాజావార్తలు
-
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్రైజర్స్ ముందు భారీ లక్ష్యం
-
Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…
-
US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
-
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!