CM Chandrababu: టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు
- గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు..
- ప్రస్తుతం మనం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నాం..
- టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పేరుతో రాజకీయాలు మర్చిపోయాం.. దీంతో మనపై దుష్ప్రచారం చేశారు.. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఏమి చేశామో చెప్పాలి అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు వివరించాలి.. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.. కానీ, గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు.. కనీసం కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేదు.. ప్రస్తుతం మనం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగు వేస్తున్నాం.. అన్ని చేశామని చెప్పడం లేదు.. అందుకే తొలి అడుగు అన్నాము.. రాష్ట్రంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని సహకరించారు అని చంద్రబాబు తెలిపారు.
Read Also: ENERepeat : టీమ్ కన్యారాశి మళ్ళి వస్తోంది.. ఈ నగరానికి ఏమైంది – 2 స్టార్ట్
Also Read
- BC Reservation Bill: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
- BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
ఇక, టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారం మనకు ముఖ్యం కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. ఏ రాజకీయ పార్టీకి రాని అవకాశాలు మనకు వచ్చాయి.. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక పరిస్థితి బయటకు వచ్చే వాతావరణం లేదు.. ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికి ఎన్నో చేస్తున్నాం.. దక్షిణ భారత రాష్ట్రాల్లో మనది విభిన్న పరిస్థితి.. రాష్ట్ర ఆదాయంలో సర్వీసు సెక్టార్ ఎక్కువ.. దీపం పథకంలో ఇప్పటికే సిలిండర్ పంపిణీ జరుగుతోంది.. పొగాకు కొనేవారు లేకపోతే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాం.. పామాయిల్ మిర్చి ఇలా ప్రతి రైతులకు న్యాయం చేస్తున్నాం.. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Sreeleela: శ్రీలీల.. ఇలాగైతే కెరీర్ నాశనమే!
అయితే, అన్నా క్యాంటీన్ లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వచ్చే నెల అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు అందుతాయి.. అమరావతికి ఇప్పటికే రూ. 15 వేల కోట్ల నిధులు వచ్చాయి.. అమరావతి పనులు ట్రాక్ లో పడ్డాయి.. 2027కి పోలవరం జాతికి అంకితం అవుతుంది.. స్టీల్ ప్లాంట్ ను కూడా లాభాల బాట పెట్టే పరిస్థితి వచ్చింది.. కృష్ణ పట్నం పోర్ట్ పనులు ప్రారంభం అవుతున్నాయి.. ఆగస్ట్ 15 నాటికి 700 సర్వీస్ లు ఆన్ లైన్ లో ఉంటాయి.. టీడీపీ చేసే సర్వేలు ఎవరు చెయ్యరు.. అన్ని స్థాయిల్లో ఇప్పటికే సర్వేలు జరిగాయి.. మనం ఏమనుకుంటున్నామనేది ముఖ్యం కాదన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ముఖ్యం.. ఒకరు చేసిన పనులు చెప్పగలరు.. దీని వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Kayadu Lohar : ఒకే ఒక్క హిట్ తో కయాదు లోహర్ దశ తిరిగింది
కాగా, టీడీపీ ఒక కుటుంబం.. ఎర్రంనాయుడు పార్టీకి పని చేస్తే ఆయన కుమారుడు కేంద్రమంత్రి అయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బాలయోగి చనిపోయినప్పుడు ఆయన కుమారుడు చిన్నవాడు.. కానీ ఇప్పుడు ఎంపీ అయ్యారు.. కుప్పంలో కార్యకర్తలు సరిగ్గా లేకపోయినా చర్యలు ఉంటాయి.. వెయ్యి, రెండు వేల నోట్లను రద్దు చేయాలని నేనే చెప్పాను.. రూ. 500 నోట్లు కూడా రద్దు చేయాలని తెలిపాను.. డబ్బులతోనే గెలుస్తామంటే కుదరదు అన్నారు. మొన్న ఎన్నికల్లో వాళ్లకి 11 మాత్రమే వచ్చాయి.. మన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు.. సమర్థమైన పాలన వల్లే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. రాష్ట్రాన్ని ఐదు జోన్లగా విభజించి అభివృద్ధి చెయ్యాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!