Deputy CM Post Controversy: లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని డిమాండ్..! టీడీపీ కీలక ఆదేశాలు
- ఏపీలో కాకరేపుతోన్న లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్..
- ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్..
- అత్యుత్సాహం వద్దని నేతలను వారించిన టీడీపీ అధిష్టానం..
- కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Post Controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది..
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
అయితే, గత నాగుగైదు రోజులుగా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్ ఏపీలో కాకరేపుతోంది.. ఈ మధ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో.. ఆయన ముందే.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ స్టేజ్పైనే మాట్లాడారు.. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్దే అని.. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ ‘యువగళం’తో ఆయన సమాధానం చెప్పారని.. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై మరికొందరు టీడీపీ నేతలు.. కీలకంగా ఉన్నవారు సైతం.. ఈ డిమాండ్ చేస్తూ వచ్చారు.. మరోవైపు.. జనసేన నుంచి దీనిపై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో.. లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయండి.. తప్పులేదు.. కానీ, పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కామెంట్లు పెట్టసాగారు.. దీంతో, అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. ఇది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే ముప్పు ఉంటుందని భావించి.. ఈ చర్చకు పులిస్టాప్ పెట్టాలని భావంచింది.. ఈ వ్యవహారంపై ఎవరూ కామెంట్లు చేయవద్దని స్పష్టం చేసింది.. దావోస్ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఇష్యూకు తెరదించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే నేతల డిమాండ్పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!