Deputy CM Post Controversy: లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని డిమాండ్..! టీడీపీ కీలక ఆదేశాలు
- ఏపీలో కాకరేపుతోన్న లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్..
- ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్..
- అత్యుత్సాహం వద్దని నేతలను వారించిన టీడీపీ అధిష్టానం..
- కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం..
Deputy CM Post Controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది..
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
అయితే, గత నాగుగైదు రోజులుగా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్ ఏపీలో కాకరేపుతోంది.. ఈ మధ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో.. ఆయన ముందే.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ స్టేజ్పైనే మాట్లాడారు.. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్దే అని.. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ ‘యువగళం’తో ఆయన సమాధానం చెప్పారని.. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై మరికొందరు టీడీపీ నేతలు.. కీలకంగా ఉన్నవారు సైతం.. ఈ డిమాండ్ చేస్తూ వచ్చారు.. మరోవైపు.. జనసేన నుంచి దీనిపై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో.. లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయండి.. తప్పులేదు.. కానీ, పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కామెంట్లు పెట్టసాగారు.. దీంతో, అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. ఇది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే ముప్పు ఉంటుందని భావించి.. ఈ చర్చకు పులిస్టాప్ పెట్టాలని భావంచింది.. ఈ వ్యవహారంపై ఎవరూ కామెంట్లు చేయవద్దని స్పష్టం చేసింది.. దావోస్ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఇష్యూకు తెరదించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే నేతల డిమాండ్పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!