MP Mithun Reddy: సుప్రీంకోర్టులో మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ.. కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
- ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..
- విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
- తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ..
- సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. మరోవైపు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ.. దీంతో, సీఐడీ దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించి రీజైండర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది.. ఇక, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ .. మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయని పేర్కొన్నారు అభిషేక్ సింఘ్వీ.. అయితే, ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: Mohanlal : ఆయనతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు..
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే.. మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని 8 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు.. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసి, సంతకాలు తీసుకున్నారు.. విచారణలో సిట్ కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం.. అయితే, ఇదంతా ఓ కట్టుకథ, గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని సిట్ విచారణ తర్వాత పేర్కొన్నారు మిథున్ రెడ్డి.. గనుల్లో అవకతవకలు జరిగాయన్నారు, ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదన్నారు. తమ సొంత భూమిని అటవీభూమి అంటూ ఆరోపణలు చేశారని ఎంపీ మిథున్రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే.. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో ఒక భాగమేనన్నారు. ఇక, బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో ఇంకేమీ మాట్లాడలేనని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..