MP Mithun Reddy: సుప్రీంకోర్టులో మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ.. కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
- ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..
- విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
- తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ..
- సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ..
MP Mithun Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. మరోవైపు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ.. దీంతో, సీఐడీ దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించి రీజైండర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది.. ఇక, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ .. మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయని పేర్కొన్నారు అభిషేక్ సింఘ్వీ.. అయితే, ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: Mohanlal : ఆయనతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు..
Also Read
- AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే.. మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని 8 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు.. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసి, సంతకాలు తీసుకున్నారు.. విచారణలో సిట్ కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం.. అయితే, ఇదంతా ఓ కట్టుకథ, గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని సిట్ విచారణ తర్వాత పేర్కొన్నారు మిథున్ రెడ్డి.. గనుల్లో అవకతవకలు జరిగాయన్నారు, ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదన్నారు. తమ సొంత భూమిని అటవీభూమి అంటూ ఆరోపణలు చేశారని ఎంపీ మిథున్రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే.. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో ఒక భాగమేనన్నారు. ఇక, బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో ఇంకేమీ మాట్లాడలేనని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!