Minister Anagani Satya Prasad: భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. మంత్రి వార్నింగ్..
- భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..
- వార్నింగ్ ఇచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్..
- భూదందాలపై ఉక్కు పాదం మోపుతామంటూ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. భూదందాలపై ఉక్కు పాదం మోపుతామంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు.. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చాం.. వైఎస్ జగన్ రెడ్డి అరాచకపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు.. కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. భూ దందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.. ఈ నెల ఆరో తేదీ నుండి జరగనున్న రెవిన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చు అని సూచించారు.. అయితే, భూ దందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవు అని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
Read Also: Maharashtra: డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన షిండే.. ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..!
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
కాగా, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 స్థానంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్-2024కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే.. వైసీపీ హయాంలో భూ కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు సుదీర్ఘంగా గతంలో చర్చించారు..వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన విచ్చలవిడి భూ దందాలపై ప్రభుత్వం దృష్టిసారించింది.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలుస్తుందని.. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుందని గతంలోనే ప్రకటించారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!