Maharashtra: డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన షిండే.. ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..!
- డిప్యూటీ సీఎం పదవికి ఒప్పుకున్న ఏక్నాథ్ షిండే..
- ఎల్లుండి సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం..
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ల ‘మహాయుతి’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా , మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. మరోవైపు డిసెంబర్ 05న ముంబైలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం పదవిపై, తన ఇతర ఆశల్ని సాధించుకునేందుకు ఏక్నాథ్ షిండే కొద్దిగా బెట్టు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Read Also: Rahul Gandhi: రేపు సంభాల్కి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు.. ఇటీవల మసీదు సర్వేలో హింస..
ప్రసుత్తం, ఆయన డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 05న ఫడ్నవీస్ సీఎంగా, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహాయుతి కూటమి భాగస్వాములైన శివసేన, బీజేపీ, ఎన్సీపీల మధ్య క్యాబినెట్ పదవులు, పోర్ట్ఫోలియోల కేటాయింపు ప్రమాణ స్వీకారం తర్వాత ఉంటుందనే సమాచారం ఉంది.
బీజేపీ హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలు దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్, శాసనమండలి చైర్మన్ పదవులను కూడా బీజేపీ దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక శివసేన 16 మంత్రిత్వ శాఖలను దక్కించుకోవాలని అనుకుంటోంది. పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన వద్ద ఉండగా, మండలి చైర్మన్ పదవిని శివసేన కోరుకుంటోంది. ఎన్సీపీ ఆర్థిక మంత్రి, డిప్యూటీ స్పీకర్తో సహా 9-10 మంత్రిత్వ శాఖలను స్వీకరించే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ వెల్లడించింది. డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదాన్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఇతర ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు, ఈ వేడుకకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!