AP Government Survey: ప్రభుత్వ సేవలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!
- ప్రభుత్వ సేవలపై ఏపీ ప్రభుత్వం సర్వే..
- జనవరి నుంచి ఏప్రిల్ మధ్య సేవలపై సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Survey: వివిధ ప్రభుత్వ సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పౌర సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది.. అయితే, ఈ సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలతో పాటు.. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.. ప్రజా పంపిణీ కింద సరఫరా చేయబడిన వస్తువులపై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు అదనపు రేట్లు వసూలు చేస్తున్నారని దాదాపు 26.7 శాతం మంది ఫిర్యాదు చేశారు.. ఇక, PDS కింద సరఫరా చేయబడిన నిత్యావసర వస్తువుల నాణ్యత చెడుగా ఉందని కొంత మంది ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయంగా తెలిపారు.. ఇక, దీపం-2 పథకం కింద పంపిణీ చేసే సంవత్సరానికి మూడు సిలిండర్లపై డెలివరీ బాయ్లు అదనపు రేటు వసూలు చేస్తున్నారానంటున్న 35.2 శాతం మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు..
Read Also: Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..
Also Read
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణం సురక్షితం కాదని భావిస్తున్నామంటూ 30 శాతం మంది ప్రజలు సర్వేలో తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్ స్టేషన్ల నిర్వహణ సరిగా లేదని 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఫిర్యాదు చేయగా.. బస్ స్టేషన్లలో పరిశుభ్రత, సీటింగ్ మరియు వెయిటింగ్ ప్రాంతాల నిర్వహణపై దాదాపు 44.4 శాతం మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.. బస్ స్టేషన్లలో తాగునీటి సౌకర్యం లేదని 53.7 శాతం మంది అభిప్రాయపడ్డారు.. సరైన టాయిలెట్లు లేవని 43.4 శాతం మంది ఫిర్యాదు చేసినట్టు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో, 45.28 శాతం మంది పౌరులు తమ ఇంటి గుమ్మం నుండి చెత్తను సేకరించడం లేదని ఫిర్యాదు చేయగా.. వారానికి రెండుసార్లు కూడా చెత్త సేకరణ జరగడం లేదని 46 శాతానికి పైగా ప్రజలు పేర్కొన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెలుగు చూసింది..
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..