Kakani Govardhan Reddy: హైకోర్టులో మాజీ మంత్రి కాకాణికి ఎదురుదెబ్బ..
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..
- కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా..
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసిన కోర్టు..
Kakani Govardhan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.. కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది హైకోర్టు.. కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు విచారించిన ఏపీ హైకోర్టు .. తెల్లారాయి అక్రమ రవాణాకి సహకరిచటంతో పాటు ఎస్సీ ఎస్టీ కేసును కాకాణిపై నమోదు చేశారు పొదలకూరు పోలీసులు.. అయితే, కాకాణి పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు అడ్వొకట్ జనరల్.. ఎస్సీ ఎస్టీ కేసులో మొదట స్పెషల్ కోర్టు కి వెళ్ళాలన్న ఏజీ.. కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు.. మొదట స్పెషల్ కోర్టు రిజెక్ట్ లేదా రిటర్న్ చేస్తే మాత్రమే హైకోర్టులో పిటిషన్ వేయాలి అంటుంది ప్రభుత్వం.. గతంలో పలు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ లు ఈ సందర్భంగా ఏజీ ఉదాహరించారు..
Read Also: Arjun S/O Vyjayanthi: ‘అర్జున్’గాడు దిగుతున్నాడు..ఎప్పుడంటే?
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
అయితే, స్పెషల్ కోర్టులకు వెళ్లకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసే వెసులుబాటు ఉందని కోర్టుకి తెలిపారు కాకాణి.. సెక్షన్ 18 కేసులో నమోదు చేశారని అది ఉంటే సెక్షన్ 14 అప్లికబుల్ కాదని కోర్టుకు తెలిపారు కాకాణి లాయర్.. ఈ కేసు విషయంలో స్పెషల్ కోర్టు పరిధి కంటే హై కోర్టుకి పరిధి, పవర్ ఎక్కువ ఉన్నాయన్న కాకాణి తరఫు లాయర్ వాధించారు.. కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు.. పిటిషన్ విచారణ అర్హత తర్వాత మెరిట్స్ మీద విచారణ చేస్తామన్న కోర్టు.. తెల్లారాయి అక్రమ మైనింగ్ ప్రభుత్వానికి చెందిన 32 ఎకరాల్లో వేరే వ్యక్తులు చేస్తున్నారని, దానికి కాకాణికి సంబంధం లేదన్నారు.. 2016లో లీజు సమయం ముగిసిందని అప్పటి నుంచి ఇది జరుగుతున్నట్టు కోర్టు దృష్టికి తెచ్చిన లాయర్.. అయితే, అప్పటి నుంచి మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది.. స్థానికంగా నివసిస్తున్న వారిపై కులం పేరుతో తిట్టారనేది కేవలం ఆరోపణ మాత్రమే అని పేర్కొన్నారు.. ఇక, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.. ఈలోపు తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కాకాణి లాయర్ కోరగా నిరాకరించింది.
తాజావార్తలు
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
-
Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!