Kakani Govardhan Reddy: హైకోర్టులో మాజీ మంత్రి కాకాణికి ఎదురుదెబ్బ..
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..
- కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా..
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.. కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది హైకోర్టు.. కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు విచారించిన ఏపీ హైకోర్టు .. తెల్లారాయి అక్రమ రవాణాకి సహకరిచటంతో పాటు ఎస్సీ ఎస్టీ కేసును కాకాణిపై నమోదు చేశారు పొదలకూరు పోలీసులు.. అయితే, కాకాణి పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు అడ్వొకట్ జనరల్.. ఎస్సీ ఎస్టీ కేసులో మొదట స్పెషల్ కోర్టు కి వెళ్ళాలన్న ఏజీ.. కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు.. మొదట స్పెషల్ కోర్టు రిజెక్ట్ లేదా రిటర్న్ చేస్తే మాత్రమే హైకోర్టులో పిటిషన్ వేయాలి అంటుంది ప్రభుత్వం.. గతంలో పలు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ లు ఈ సందర్భంగా ఏజీ ఉదాహరించారు..
Read Also: Arjun S/O Vyjayanthi: ‘అర్జున్’గాడు దిగుతున్నాడు..ఎప్పుడంటే?
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
అయితే, స్పెషల్ కోర్టులకు వెళ్లకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసే వెసులుబాటు ఉందని కోర్టుకి తెలిపారు కాకాణి.. సెక్షన్ 18 కేసులో నమోదు చేశారని అది ఉంటే సెక్షన్ 14 అప్లికబుల్ కాదని కోర్టుకు తెలిపారు కాకాణి లాయర్.. ఈ కేసు విషయంలో స్పెషల్ కోర్టు పరిధి కంటే హై కోర్టుకి పరిధి, పవర్ ఎక్కువ ఉన్నాయన్న కాకాణి తరఫు లాయర్ వాధించారు.. కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు.. పిటిషన్ విచారణ అర్హత తర్వాత మెరిట్స్ మీద విచారణ చేస్తామన్న కోర్టు.. తెల్లారాయి అక్రమ మైనింగ్ ప్రభుత్వానికి చెందిన 32 ఎకరాల్లో వేరే వ్యక్తులు చేస్తున్నారని, దానికి కాకాణికి సంబంధం లేదన్నారు.. 2016లో లీజు సమయం ముగిసిందని అప్పటి నుంచి ఇది జరుగుతున్నట్టు కోర్టు దృష్టికి తెచ్చిన లాయర్.. అయితే, అప్పటి నుంచి మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది.. స్థానికంగా నివసిస్తున్న వారిపై కులం పేరుతో తిట్టారనేది కేవలం ఆరోపణ మాత్రమే అని పేర్కొన్నారు.. ఇక, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.. ఈలోపు తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కాకాణి లాయర్ కోరగా నిరాకరించింది.
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!