RTA Special Drive in AP: ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. ఏపీలో భారీగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీజ్..
- కర్నూలులో బస్సు ప్రమాదంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వాహనాల్లో విస్తృత తనిఖీలు..
- నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు..
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTA Special Drive in AP: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఇటు, తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. మరోవైపు బెంగళూరులోనూ ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దీంతో, కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు.. మరోవైపు.. కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు రవాణా శాఖ అధికారులు.. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై ఈ రోజు ఇప్పటికే 289 కేసులు నమోదు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు..
Read Also: Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్పై లాలూ ప్రసాద్ మండిపాటు
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
ఇక, విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనున్నాయి ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేటు ట్రావెల్స్కు భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఇప్పటి వరకు 7.08 లక్షల రూపాయల వరకు జరిమానా విధించారు.. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు కాగా.. 3 ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు.. తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు కాగా.. 4 బస్సులు సీజ్.. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు అధికారులు.. సరైన ధ్రువపత్రాలు లేని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, ఫైర్ పరికరాలు లేని 103 బస్సులు, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులు, ఇతర ఉల్లంఘనలపై 127 బస్సులపై కేసులు నమోదయ్యాయి.. ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. ఇప్పటికే విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ వైపు వెళ్లే పలు ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్స్ రద్దు చేస్తున్నాయి పలు ట్రావెల్స్ సంస్థలు..
తాజావార్తలు
-
CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..