RTA Special Drive in AP: ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. ఏపీలో భారీగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీజ్..
- కర్నూలులో బస్సు ప్రమాదంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వాహనాల్లో విస్తృత తనిఖీలు..
- నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు..
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTA Special Drive in AP: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఇటు, తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. మరోవైపు బెంగళూరులోనూ ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దీంతో, కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు.. మరోవైపు.. కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు రవాణా శాఖ అధికారులు.. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై ఈ రోజు ఇప్పటికే 289 కేసులు నమోదు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు..
Read Also: Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్పై లాలూ ప్రసాద్ మండిపాటు
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనున్నాయి ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేటు ట్రావెల్స్కు భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఇప్పటి వరకు 7.08 లక్షల రూపాయల వరకు జరిమానా విధించారు.. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు కాగా.. 3 ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు.. తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు కాగా.. 4 బస్సులు సీజ్.. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు అధికారులు.. సరైన ధ్రువపత్రాలు లేని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, ఫైర్ పరికరాలు లేని 103 బస్సులు, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులు, ఇతర ఉల్లంఘనలపై 127 బస్సులపై కేసులు నమోదయ్యాయి.. ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. ఇప్పటికే విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ వైపు వెళ్లే పలు ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్స్ రద్దు చేస్తున్నాయి పలు ట్రావెల్స్ సంస్థలు..
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!