Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక మార్క్ కనిపించేలా పని చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో పోస్టు చేసి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
గ్రామీణ రోడ్ల నిర్మాణం:
– రూ.3,200 కోట్లు పెట్టుబడి చేసి 5,000 కి.మీ CC రోడ్ల నిర్మాణం, 866 కి.మీ పూర్తయింది.
– పల్లెపండుగ 2.0 ప్రాజెక్ట్ ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల నిర్మాణ లక్ష్యంగా అడుగులు.
– రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం చర్యలు ప్రారంభం.
– అడవితల్లి బాట ప్రాజెక్ట్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రూ.1,069 కోట్లతో 1,005 కి.మీ రోడ్లు.
సర్కారీ ఉద్యోగుల ప్రమోషన్, కార్యాలయాలు:
– 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు.
– 77 కొత్త DDO కార్యాలయాల ప్రారంభం.
– 77 మంది ZP CEO లకు పదోన్నతులు.
ఇంజనీరింగ్ విభాగం & పెద్ద ప్రాజెక్టులు:
– పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ.9,500 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించింది.
– ఇప్పటికే రూ.2,600 కోట్ల విలువైన రోడ్లు పూర్తయి, బిల్లులు చెల్లించబడ్డాయి.
– రూ.5,300 కోట్ల విలువైన రోడ్ల పనులు దశలో ఉన్నాయి.
– త్వరలో రూ.1,600 కోట్ల PMGSY నిధులు విడుదల కానున్నాయి.
మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి, సర్కారీ ఉద్యోగుల పునర్నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికకై చేపట్టబడ్డాయని చెప్పారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan సారథ్యంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ
గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాల వివరాలు
• ₹3,200 కోట్ల నిధులతో 5,000 కిమీ సీసీ రోడ్లు, 866 కి.మీ నిర్మాణం
• పల్లెపండుగ 2.O ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల… pic.twitter.com/h3iXjJlcgD— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 7, 2026
