Pawan Kalyan: ఆర్జీవీ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఆసక్తికర వ్యాఖ్యలు
- దర్శకుడు ఆర్జీవీ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం..
- ఢిల్లీలో పవన్ కల్యాణ్ కు మీడియా నుంచి ప్రశ్నలు..
- నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని వ్యాఖ్య..
- లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చేయడం లేదన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది.. అయితే, అజ్ఞాతంలోనే ఉన్నారు ఆర్జీవీ.. మరోవైపు.. వర్మను అదుపులోకి తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.. ఇక, మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఆర్జీవీ.. ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆర్జీవీ వివాదంపై స్పందించారు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్కు ఆర్జీవీ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి.. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్ కల్యాణ్..
Read Also: Prabhas: విదేశాలకు ప్రభాస్.. ఆ హీరోయిన్లలో ఎవరితో రొమాన్స్?
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ఇక, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపతాయిస్తున్నారు.. అనే విషయాన్ని ముఖ్యమంత్రిని అడుగుతాను.. ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగారని చెప్తాను అన్నారు పవన్ కల్యాణ్.. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీపై ఆయన మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కు బడ్జెట్ ను పెంచమని కేంద్ర మంత్రిని కోరాం.. సమయం పొడగించమని కోరాం అన్నారు.. పోలవరం పై ముఖ్యమంత్రి మాట్లాడుతారన్న ఆయన.. గత ప్రభుత్వం చేసిన తప్పులు.. వారసత్వంగా వస్తున్నాయి.. వాళ్ల తప్పుల వల్ల మనం మాట పడుతున్నాం.. ఏపీలో జనజీవన్ మిషన్ పై రెండు మూడు వారాల్లో డీపీఆర్ ఇస్తాం అన్నారు.. మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు ఉపరాష్ట్రపతి.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుస్తాం అన్నారు పవన్.
Read Also: Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్
ప్రధాని మోడీతో కూడా జల జీవన్ మిషన్ పై చర్చిస్తాను అన్నారు పవన్ కల్యాణ్.. పీఎం కోరిక ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు అందించాలని.. ఏపీలో పైప్ లైన్స్.. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి.. వాటర్ ప్రెషర్ సరిపోవడం లేదు.. మోటార్లు పెట్టి నీటిని లాగితే.. ఆ తర్వాత ఉన్న వాళ్లకు నీళ్లు రావటం లేదు.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాను అని తెలిపారు.. సౌర విద్యుత్ టెండర్ల అవినీతిపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. సమోసలకే 9 కోట్లు ఖర్చు పెట్టారు.. బాధ్యతా రాహిత్యం.. బయాలు లేవు.. పారదర్శకత అస్సలు లేదు గత ప్రభుత్వంలో అని దుయ్యబట్టారు.. భవిష్యత్ లో ఇలా పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇక, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!