Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవం.. 3 రోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ..
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
- మూడు రోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ సమావేశాలు..
- మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీ నిర్వహణ..
- జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటూ 2014 మార్చి నెలలో జనసేన పార్టీని ప్రారంభించారు పవన్ కల్యాణ్.. పోటీ దూరంగా ఉండి.. మరొకరి విజయం కోసం పనిచేసినా.. పొత్తులు పెట్టుకుని విజయాలు అందుకున్నా.. ఓటములు చవిచూసినా.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి విజయంలో కీలక భూమిక పోషించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అయితే, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. మూడు రోజుల పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ప్లీనరీ నిర్వహణపై పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ రోజు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంల నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు..
Also Read
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు.. మార్చి 12 నుంచి 14 తేదీల్లో ప్లీనరీని పిఠాపురంలో నిర్వహిస్తామని తెలిపారు నాదెండ్ల మనోహర్.. 2014 మార్చి 14న విశాల దృక్పథంతో, ప్రజాహితం కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.. పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదరైనా బలంగా నిలిచారు.. ఈ రోజు కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైనది.. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించబోతున్నాంం.. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ.. తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ధేశించేలా ప్లీనరీ సాగాలి.. ఇందు కోసం పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని.. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమించుకోవాలి.. వారందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం అన్నారు..
Read Also: Bangladeshi Singer: కోల్కతా ఈవెంట్కి బంగ్లాదేశ్ సింగర్.. సీపీఎం ఆహ్వానంపై వివాదం..
మూడు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాల గురించి వివరిస్తూ.. 12వ తేదీన ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం డెలిగేట్స్తో ఉంటుంది.. 14వ తేదీన బహిరంగ సభ ఉంటుందన్నారు నాదెండ్ల మనోహర్.. ఈ మూడు రోజులు వివిధ అంశాలపై చేపట్టే చర్చాగోష్టులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండేలా ఆలోచన చేస్తున్నాం అన్నారు.. ఇక, ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, లోకం మాధవి, అరవ శ్రీదర్, బొలిశెట్టి శ్రీవివాస్, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, పార్టీ నేతలు మహేందర్రెడ్డి, శంకర్ గౌడ్, కోన తాతారావు, కల్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది..
తాజావార్తలు
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..