Rajya Sabha Election: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి.. సీఎంతో మర్యాదపూర్వక భేటీ..
- రాజ్యసభ ఎన్నికల్లో పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు..
- అనంతరం సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Election: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ.. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తదితర ఇతర నేతలు పాల్గొన్నారు.. ఇక, నామినేషన్ వేసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు కూటమి రాజ్యసభ అభ్యర్థి పాకా సత్యనారాయణ… బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎంకు వివరించారు.. కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగింది.. ఈ సమావేశంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు..
Read Also: Awake At Midnight: అర్ధరాత్రి దాటినా నిద్ర పొవట్లేదా? ఇక ఈ సమస్యలతో సతమతవాల్సిందే!
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
కాగా, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఏపీ నుంచి రాజ్యసభకు ఖాళీ ఏర్పడింది.. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇవాళ్టితో నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది.. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి రాజ్యసభ బరిలో నిలిచేది ఎవరు? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. టీడీపీ-జనసేన.. బీజేపీకి ఆ స్థానాన్ని వదిలేసింది.. దీంతో.. పార్టీతో సుదీర్ఘ కాలం పనిచేస్తూ వస్తున్న పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడం.. ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిపోయాయి.. 1980 నుండి నేటి వరకు భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తగా, పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ మరియు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనేక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, భీమవరం మునిసిపల్ కౌన్సిలర్గా ప్రజల మన్ననలు పొంది, ఓబీసీ సంఘాల నాయకుడిగా బీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ, రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పాక వెంకట సత్యనారాయణ ఎన్నిక లాంఛనమేకానుంది..
తాజావార్తలు
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!