Rajya Sabha Election: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి.. సీఎంతో మర్యాదపూర్వక భేటీ..
- రాజ్యసభ ఎన్నికల్లో పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు..
- అనంతరం సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ..
Rajya Sabha Election: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ.. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తదితర ఇతర నేతలు పాల్గొన్నారు.. ఇక, నామినేషన్ వేసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు కూటమి రాజ్యసభ అభ్యర్థి పాకా సత్యనారాయణ… బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎంకు వివరించారు.. కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగింది.. ఈ సమావేశంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు..
Read Also: Awake At Midnight: అర్ధరాత్రి దాటినా నిద్ర పొవట్లేదా? ఇక ఈ సమస్యలతో సతమతవాల్సిందే!
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
కాగా, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఏపీ నుంచి రాజ్యసభకు ఖాళీ ఏర్పడింది.. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇవాళ్టితో నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది.. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి రాజ్యసభ బరిలో నిలిచేది ఎవరు? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. టీడీపీ-జనసేన.. బీజేపీకి ఆ స్థానాన్ని వదిలేసింది.. దీంతో.. పార్టీతో సుదీర్ఘ కాలం పనిచేస్తూ వస్తున్న పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడం.. ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిపోయాయి.. 1980 నుండి నేటి వరకు భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తగా, పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ మరియు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనేక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, భీమవరం మునిసిపల్ కౌన్సిలర్గా ప్రజల మన్ననలు పొంది, ఓబీసీ సంఘాల నాయకుడిగా బీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ, రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పాక వెంకట సత్యనారాయణ ఎన్నిక లాంఛనమేకానుంది..
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!