Mudragada Padmanabham: సీఎ చంద్రబాబు, మంత్రి లోకేష్కి ముద్రగడ లేఖ.. కాపులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ..
- చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు..
- కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించండి అంటూ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం) ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Pakistan vs ICC: భారత్ మ్యాచ్కే బాయ్కాట్ ఎందుకు?.. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిపై ఐసీసీ ఫైర్
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఇక, కాపు కులం చంద్రబాబుపై కోపంగా ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్ల ఉన్న ప్రేమతోనే టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నది తన అభిప్రాయమని ముద్రగడ లేఖలో తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని, అయితే పవన్ కల్యాణ్ మద్దతుతోనే వారు మళ్లీ రోడ్డెక్కారని వ్యాఖ్యానించారు. కాపు కులంపై చంద్రబాబు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారని ఆరోపించిన ముద్రగడ, ప్రస్తుతం రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలన కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది దహన కాండను తలపిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆశ్రయించి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన విధించాలని కోరితే, ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చెప్పిన మాటలు అబద్ధమని తేలిందని, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు అంశాన్ని హాట్టాపిక్గా మార్చింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!