Mopidevi and Masthan Rao: వైసీపీకి గుడ్బై.. ఎంపీ పదవికి మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్..
- రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి.. బీద మస్తాన్రావు రాజీనామా..
- వైసీపీకి కూడా గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటన..
- వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mopidevi and Masthan Rao: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..
Read Also: MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..
Also Read
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీద మస్తాన్రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను.. రాజకీయ భవిష్యత్పై త్వరలో నిర్ణయం తీసుకుంటాను అన్నారు.. వ్యక్తిగత కారణాలే నా రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు.. సాంకేతికంగా, సంప్రదాయంగా రాజ్యసభ ఛైర్మన్ కొన్ని ప్రశ్నలు అడిగారు.. ఇష్టపూర్వకంగానే రాజీనామాలు చేశామని ఇద్దరం చెప్పామని వెల్లడించారు.. రాజ్యసభ సభ్యునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు.. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.. నాకు ముందు నుంచి కూడా జాతీయ రాజకీయలంటేనే ఇష్టం.. రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్రావు..
Read Also: Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?
ఇక, మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలే నాకిష్టమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండాలన్నదే నాకిష్టం అన్నారు.. తెలుగుదేశం పార్టీలో తేరబోతున్నాన్నది వాస్తవమే.. ఇందులో దాచేదేమీ లేదన్నారు.. రాజకీయంగా మనుగడ సాగించేందుకు, సముచితమైన రీతిలోనే నాకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు…అందుకు కృతజ్ఞతలు తెలుపుున్నారు.. అయితే, రేపల్లె అసెంబ్లీ స్థానానికి నాకంటే సమర్ధుడికి ఇచ్చినా నాకు అభ్యంతరం ఉండేది కాదన్నారు.. ఎంత చెప్పినా, పార్టీ అధినాయకత్వం వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నన్ను కాదనుకున్నప్పుడు, నాకంటే సమర్ధుడుకు టికెట్ ఇచ్చినా సరిగ్గా ఉండేది అన్నారు మోపిదేవి వెంకటరమణ.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..