AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. ఈసారి 96.02 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచాయి. ప్రభుత్వ పరిధిలో విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్న గురుకులాల్లో ఎంజేపీ సంస్థలు అగ్రస్థానంలో నిలవడం విశేషం. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా, నరవాడ ఎంజేపీ పాఠశాలకు చెందిన విద్యార్థులు 596, 593 మార్కులు సాధించి విశిష్ట ఫలితాలు నమోదు చేశారు. మొత్తం 100 పాఠశాలల్లో 30 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం ఈ సంస్థల విద్యా ప్రమాణాలను మరోసారి నిరూపించింది.
Read Also: Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
ఈ అద్భుత విజయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కృషి ఫలితంగానే ఈ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల విద్యోన్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని, బీసీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజేపీ బీసీ గురుకులాల ఈ విజయంతో ప్రభుత్వ విద్యా సంస్థలపై విశ్వాసం మరింత పెరిగిందన్నారు మంత్రి సవిత.. కాగా, ఈ ఏడాది 6,18,131 మంది టెన్త్ పరీక్షలు రాయగా.. 5,26,9654 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. అంటే 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.. బాలురు 82.68 శాతం పాస్ అయితే.. బాలికలు 87.9 శాతం పాస్ అయ్యి మరోసారి సత్తా చాటారు.. ఇక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు మరో అవకాశం లభిస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు ఫీజు చెల్లించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఇక, ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా అవకాశం కల్పించారు. మే 1 నుంచి మే 7 వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సరైన ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!