AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. ఈసారి 96.02 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచాయి. ప్రభుత్వ పరిధిలో విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్న గురుకులాల్లో ఎంజేపీ సంస్థలు అగ్రస్థానంలో నిలవడం విశేషం. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా, నరవాడ ఎంజేపీ పాఠశాలకు చెందిన విద్యార్థులు 596, 593 మార్కులు సాధించి విశిష్ట ఫలితాలు నమోదు చేశారు. మొత్తం 100 పాఠశాలల్లో 30 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం ఈ సంస్థల విద్యా ప్రమాణాలను మరోసారి నిరూపించింది.
Read Also: Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
ఈ అద్భుత విజయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కృషి ఫలితంగానే ఈ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల విద్యోన్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని, బీసీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజేపీ బీసీ గురుకులాల ఈ విజయంతో ప్రభుత్వ విద్యా సంస్థలపై విశ్వాసం మరింత పెరిగిందన్నారు మంత్రి సవిత.. కాగా, ఈ ఏడాది 6,18,131 మంది టెన్త్ పరీక్షలు రాయగా.. 5,26,9654 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. అంటే 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.. బాలురు 82.68 శాతం పాస్ అయితే.. బాలికలు 87.9 శాతం పాస్ అయ్యి మరోసారి సత్తా చాటారు.. ఇక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు మరో అవకాశం లభిస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు ఫీజు చెల్లించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఇక, ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా అవకాశం కల్పించారు. మే 1 నుంచి మే 7 వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సరైన ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!