Minister Parthasarathy: కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి.. వీటికి ఆమోదం..
- ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు..
- నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు కేటాయింపు..
- తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాల అమలు..
Minister Parthasarathy: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీ లకు కేటాయించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది.. తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంపై మంత్రులు దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు… నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 50 శాతం పదవులు కేటాయింపులను రద్దు చేశారు… మహిళా పారిశ్రామిక వేత్తలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం.
Read Also: Fact Check : భారతీయులకు అమెరికా సంకెళ్లు వేసిందా? వైరల్ అవుతున్న ఫొటోల్లో నిజమెంత?
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందన్నారు మంత్రి పార్థసారథి.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. 40 వేల కోట్లకు పైగా సౌర, పవన ఇంధన రంగంలో పెట్టుబడులు రానున్నాయి.. 19 వేల ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది అన్నారు.. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయన్నారు మంత్రి పార్థసారథి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు… పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల టెండర్ లను రద్దు చేసి కొత్తగా పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పోటు సూపర్ వైజర్ల నియామకానికి ఆమోదం తెలిపింది కేబినెట్.. సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యం కోసం అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ కోసం డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.. చెన్నై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో కొందరు రైతులకు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం.. మానవ వనరులను అభివృద్ధికి ఏపీ నాలెడ్జి సొసైటీ కెపాసిటి బిల్డింగ్ 2025కి ఆమోదం తెలిపింది.. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పెద్దపీట వేసేలా సౌర పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో