Fact Check : భారతీయులకు అమెరికా సంకెళ్లు వేసిందా? వైరల్ అవుతున్న ఫొటోల్లో నిజమెంత?
- అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు
- పంజాబ్కి చేరుకున్న 104 మంది భారతీయులు
- సోషల్ మీడియాలో పోస్టులు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. 104 మంది భారతీయులు పంజాబ్లోని శ్రీ గురు రామ్దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
READ MORE: Central Election Commission: సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..
Also Read
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
దీనితో ఓ భారతీయుడి చేతికి సంకెళ్లు వేసి వెనక్కి పంపించారని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. భారతీయులను చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి పంపారని ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. 200 మందికి పైగా భారతీయులను అమానుషంగా బహిష్కరించారని మరో పోస్ట్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారులైన భారతీయుల చేతులకు సంకెళ్లు ఉన్నాయని.. వారిని నేరస్థులలాగా చూశారని, కనీసం సుదీర్ఘ ప్రయాణంలో విమానాల్లో టాయిలెట్ని ఉపయోగించడానికి అనుమతి లేదని పుకార్లు సికార్లు కొడుతున్నాయి. ‘డాక్టర్ ఎస్ జైశంకర్, మోడీ ప్రభుత్వం భారతీయ పౌరులను గౌరవప్రదంగా మన దేశానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయలేదా?’ అనే ప్రశ్నలు సైతం వచ్చాయి. ఈ అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ ఫొటోలు భారతీయులకు చెందినవి కాదని కొట్టిపారేసింంది. “అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారత్కు పంపినప్పుడు వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు, గొలుసులు వేయలేదు. ఈ పోస్ట్లలో షేర్ అవుతున్న చిత్రాలు భారతీయులవి కావు. గ్వాటెమాలాకు పంపిన వారివి.” అని పీఐబీ పేర్కొంది.
READ MORE:Maha Kumbh Mela: కుంభమేళాలో మరో ప్రమాదం.. కారు డివైడర్ను ఢీకొని 8 మంది మృతి
తాజావార్తలు
-
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!