Fact Check : భారతీయులకు అమెరికా సంకెళ్లు వేసిందా? వైరల్ అవుతున్న ఫొటోల్లో నిజమెంత?
- అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు
- పంజాబ్కి చేరుకున్న 104 మంది భారతీయులు
- సోషల్ మీడియాలో పోస్టులు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. 104 మంది భారతీయులు పంజాబ్లోని శ్రీ గురు రామ్దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
READ MORE: Central Election Commission: సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
దీనితో ఓ భారతీయుడి చేతికి సంకెళ్లు వేసి వెనక్కి పంపించారని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. భారతీయులను చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి పంపారని ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. 200 మందికి పైగా భారతీయులను అమానుషంగా బహిష్కరించారని మరో పోస్ట్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారులైన భారతీయుల చేతులకు సంకెళ్లు ఉన్నాయని.. వారిని నేరస్థులలాగా చూశారని, కనీసం సుదీర్ఘ ప్రయాణంలో విమానాల్లో టాయిలెట్ని ఉపయోగించడానికి అనుమతి లేదని పుకార్లు సికార్లు కొడుతున్నాయి. ‘డాక్టర్ ఎస్ జైశంకర్, మోడీ ప్రభుత్వం భారతీయ పౌరులను గౌరవప్రదంగా మన దేశానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయలేదా?’ అనే ప్రశ్నలు సైతం వచ్చాయి. ఈ అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ ఫొటోలు భారతీయులకు చెందినవి కాదని కొట్టిపారేసింంది. “అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారత్కు పంపినప్పుడు వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు, గొలుసులు వేయలేదు. ఈ పోస్ట్లలో షేర్ అవుతున్న చిత్రాలు భారతీయులవి కావు. గ్వాటెమాలాకు పంపిన వారివి.” అని పీఐబీ పేర్కొంది.
READ MORE:Maha Kumbh Mela: కుంభమేళాలో మరో ప్రమాదం.. కారు డివైడర్ను ఢీకొని 8 మంది మృతి
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!