AP Assembly: టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. అసెంబ్లీ సోమవారానికి వాయిదా
- అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా..
- టిడ్కో ఇళ్ల అంశంపై సభలో మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.. అయితే, టిడ్కో ఇళ్ల అంశంపై సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశామని తెలిపారు.. హడ్కో నుంచీ రుణం ప్రభుత్వమే తీసుకుని టిడ్కో రుణాలు తీరుస్తాం అని వెల్లడించారు. లబ్ధిదారులను మార్చేయడం, డీడీలు కట్టించుకుని బ్యాంకులో వేయలేదు అన్నదానిపై దర్యాప్తు జరిపిస్తారని స్పష్టం చేశారు.. పూర్తయిన ఇళ్లకు ముందుగా సౌకర్యాలు ఇస్తాం అన్నారు.. 2018-19 లో నిర్ణయించిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్లు కేటాయిస్తాం అని వెల్లడించారు మంత్రి నారాయణ.
Read Also: Nabha Natesh : చక్కగా చీరకట్టి చిక్కటి అందాలను చూపిస్తోన్న నభా నటేశ్
Also Read
ఇక, అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. 2024-25 సంవత్సరానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయంపుపై అసెంబ్లీలో నోట్ ఆన్ డిమాండ్స్ ప్రవేశపెట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు.. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్ లకు 15,513 కోట్ల రూపాయలు కేటాయింపు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు నిమ్మల.. అలాగే చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు 1,227 కోట్ల రూపాయల నిధులు కేటాయంపు కోరుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.. ఇక, టిడ్కో ఇళ్ళ నిర్మాణాలపై శాసన సభలో చర్చ కొనసాగుతోంది.. మరోవైపు.. జలవనరులు శాఖ మంత్రి రామానాయుడుతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి భేటీ అయ్యారు.. రాయచోటి నియోజకవర్గ నీటి సమస్యలపై చర్చించారు.. శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్ బ్యాలెన్స్ పనులు పూర్తికి 156 కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి రాంప్రసాద్రెడ్డి.. కాగా, ఈ రోజు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.. ఏపీ శాసనసభ మాజీ సభ్యులు కెంబూరి రామ్మోహనరావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, అడుసుమిల్లి జయప్రకాష్, శ్రీమతి మాగుంట పార్వతమ్మ మరియు శ్రీ రెడ్డి సత్యనారాయణ మరియు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాప తీర్మానం పెట్టారు.. మృతులకు సంతాపంగా రెండు నిముషాల మౌనం పాటించింది శాసన సభ..
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..