Minister Narayana: రాజధాని పనులు పరిశీలించి మంత్రి నారాయణ.. కీలక వ్యాఖ్యలు..
- అమరావతి రాజధాని రీ లాంచ్ కార్యక్రమం..
- ఏప్రిల్ మూడో వారంలో అమరావతికి ప్రధాని మోడీ..
- ప్రధానితో త్వరలోనే సీఎం చంద్రబాబు భేటీ అవుతారన్న మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు.. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా.. సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25 నిర్మాణాలు ఉన్నాయి.. 18 నెలల కాలంలో పూర్తి చెయ్యాలనే దిశగా సూచనలు చేశారు నారాయణ..
Read Also: Chennai: యూట్యూబర్ ఇంటిపై దుండగుల దాడి.. బకెట్ల కొద్దీ మురికి పారబోసి బెదిరింపులు
Also Read
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం.. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ.. 43 వేల కోట్లకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచాము. అధికారులు ఎమ్మెల్యే ల భవనాలు.. మంత్రులు.. జడ్జీల భవనాలు దాదాపు పూర్తయ్యాయి. కానీ, గత ప్రభుత్వం ఇదేమి పట్టించుకోలేదు.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి.. ఐఐటీ మద్రాస్ ను పిలిచి బిల్డింగ్ నాణ్యత.. పరిశీలించి కాంట్రాక్టర్లు తో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం.. 90 శాతం పనులు టెండర్లు కంప్లీట్ అయ్యాయి.. మొదట క్లీనింగ్ తో పనులు మొదలు అయ్యాయి.. ఇవాళ సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ బంగళాలు పరిశీలించాం.. 186 బంగాళాలు మంత్రులు జడ్జీలు.. సెక్రెటరీలకు వస్తున్నాయి.. గెజిటెడ్ అధికారులకు 1440.. ఎన్జీవో లకుబ్1995 నిర్మాణాలు వస్తున్నాయి.. హై కోర్టు 16.85 లక్షల చదరవు అడుగులు వస్తుంది.. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తు లో వస్తుంది… పనులు 15 రోజుల్లో మొదలు అవుతాయి. మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి అని వెల్లడించారు.
Read Also: Raja Saab : రాజాసాబ్ షూట్ ఇంకా పెండింగ్.. రిలీజ్ డౌటే
ప్రజలపై భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందన్నారు నారాయణ.. వరల్డ్ బ్యాంక్.. ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నాం. ల్యాండ్ వాల్యు పెరిగిన తర్వాత.. అప్పు తీర్చడం జరుగుతుందన్నారు.. ప్రజల డబ్బు వేస్ట్ చేస్తున్నారు అని ప్రతిపక్షం చెబుతోంది. ఇది కరక్ట్ కాదని తెలిపారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!