Minister Nadendla Manohar: ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయం
- ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ..
- మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం..
- హాజరైన మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు, సత్య కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ ఏపీ సచివాలయంలో సమావేశమైంది.. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై జరిగిన ఈ మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ముఖ్యంగా, మార్కెట్ ధరలపై నిత్యం పర్యవేక్షణ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు, మిల్లెట్ల ప్రోత్సాహం దిశగా చర్యలపై చర్చించారు.. ప్రస్తుత మార్కెట్ లో ధరల పరిస్ధితిని సమీక్షించిన మంత్రులు, అధికారులు..
Read Also: Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యోల్బణం రేటు 4.34 శాతం కాగా, జాతీయ సగటు 5.22 శాతం కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.. 154 మండల కేంద్రాల్లోని సీపీ యాప్ ద్వారా ప్రతీరోజూ ధరల సేకరణ, విశ్లేషణ చేస్తోంది ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్లో 69 నిత్యవసర సరుకులు ధరలను పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు వీటిలో ధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, మసాలాలు ఉండనున్నాయి.. గత ఏడాదితో పోల్చితే కందిపప్పు (13%), గ్రౌండ్నట్ ఆయిల్ (4%), మిర్చి (27%) ధరలు తగ్గినట్టు తెలిపారు.. అయితే, AP మిషన్ మిల్లెట్ వంటి పథకాల ద్వారా జొన్నలు, రాగిలను ప్రోత్సహించేందుకు మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది.. మిడ్-డే మీల్స్, సంక్షేమ పథకాలలో మిల్లెట్లు చేర్చడం.. అదే విధంగా మిల్లెట్ వాడకాన్ని ప్రోత్సహించడంపై చర్చ సాగింది.. రైతులకు ధరల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి.. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అధికంగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడానికి కారణం కావడంతో… ధరల అదుపుకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది మంత్రుల కమిటీ..
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..