Amravati: అమరావతిలో చివరి దశకు జంగిల్ క్లియరెన్స్ పనులు
- అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు..
- రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 జోన్లుగా విభజన..
- కంపచెట్ల తొలగింపు పనులు పూర్తి చేసిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amravati: కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.. రాజధాని 29 గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన భూములు 34 వేల ఎకరాలు కాగా, ప్రభుత్వ భూములతో కలుపుకుని మొత్తం 58 వేల ఎకరాలున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇందులో 24వేల ఎకరాలు కంపచెట్లతో అడవిలా మారిపోయింది. దీంతో ఈ మొత్తం జంగిల్ను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం 36.50 కోట్లతో పనులు ప్రారంభించింది. ఈ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ సొంతం చేసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 జోన్లుగా విభజించి కంపచెట్ల తొలగింపు పనులు పూర్తి చేసింది. వీటిలో వందలాది పొక్లెయినర్లతో, కార్మికులతో పనులు జరిగాయి..
Read Also: CM Chandrababu: విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
రోజూ పదుల సంఖ్యలో ఎక్స్కవేటర్లు, వందల సంఖ్యలో కార్మికులు, కూలీలు కంపచెట్ల తొలగింపులో పని చేసారు… రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పనులు వేగంగా జరిగాయి. పనులు మొదలైన తరువాత రెండు మూడు రోజులు వర్షాలు పడడం, స్థలాలు బురదతో నిండిపోవడంతో కంపచెట్ల తొలగింపు కొంత మందకొడిగా సాగింది. రెండు మూడు రోజులుగా వాతావరణం పొడిగా వుండడంతో పనుల్లో వేగం పెరిగింది. అమరావతిలో కంపచెట్లు తొలగించడంతో మొత్తం ప్రాంతమంతా మైదానంలా చదునుగా కనిపిస్తోంది. చెట్ల మధ్యలో ఇప్పటి వరకూ కనిపించకుండా పోయిన హైకోర్టు భవనం ఇప్పుడు దర్శనమిస్తోంది. చెట్ల మధ్య కనిపించకుండా పోయిన సైన్బోర్డులు, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల హద్దురాళ్లు ఇప్పుడు బయటపడుతున్నాయి.
Read Also: Arvind Kejriwal: ఎన్నికల ముందు శుభవార్త.. మరో 80,000 మందికి వృద్ధాప్య పెన్షన్
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు తుది దశకు చేరాయి. సుమారు 24 వేల ఎకరాల్లో రూ.36 కోట్ల వ్యయంతో ఆగస్టులో చేపట్టిన ఈ పనులు దాదాపు 96 శాతం మేర పూర్తయ్యాయి. గుత్తేదారు సంస్థ ఎన్సీసీ మొత్తం 99 గ్రిడ్లుగా విభజించి సుమారు 400 యంత్రాలతో ఈ పనులు చేపట్టింది. తొలగించిన ముళ్ల చెట్లు ఎండిపోయాక ముక్కలుగా కత్తిరించేందుకు ఒక టఫ్ గ్రైండింగ్ మెషీన్ తెచ్చారు.. ఆ ముక్కలను సిమెంట్ పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలించనున్నారు. 520 హార్స్ పవర్ ఇంజిన్ తో రోజుకు 50 టన్నులు పొడి చేసే కెపాసిటీ ఉన్న మెషీన్ అది.. ఈ పొడిని బయో డీజిల్ గానూ, బ్రికెట్లు గానూ తయారు చేస్తారు.. అయితే ఇండియాలో ఇవి రెండే ఉండటం విశేషం… త్వరలో మరో ఎనిమిది రప్పించి పని వేగవంతం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం… మొత్తంగా జంగిల్ క్లియరెన్స్ చివరి అంకంగా ముళ్ళ కంపను పొడి చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!