Amravati: అమరావతిలో చివరి దశకు జంగిల్ క్లియరెన్స్ పనులు
- అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు..
- రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 జోన్లుగా విభజన..
- కంపచెట్ల తొలగింపు పనులు పూర్తి చేసిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amravati: కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.. రాజధాని 29 గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన భూములు 34 వేల ఎకరాలు కాగా, ప్రభుత్వ భూములతో కలుపుకుని మొత్తం 58 వేల ఎకరాలున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇందులో 24వేల ఎకరాలు కంపచెట్లతో అడవిలా మారిపోయింది. దీంతో ఈ మొత్తం జంగిల్ను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం 36.50 కోట్లతో పనులు ప్రారంభించింది. ఈ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ సొంతం చేసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 జోన్లుగా విభజించి కంపచెట్ల తొలగింపు పనులు పూర్తి చేసింది. వీటిలో వందలాది పొక్లెయినర్లతో, కార్మికులతో పనులు జరిగాయి..
Read Also: CM Chandrababu: విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
రోజూ పదుల సంఖ్యలో ఎక్స్కవేటర్లు, వందల సంఖ్యలో కార్మికులు, కూలీలు కంపచెట్ల తొలగింపులో పని చేసారు… రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పనులు వేగంగా జరిగాయి. పనులు మొదలైన తరువాత రెండు మూడు రోజులు వర్షాలు పడడం, స్థలాలు బురదతో నిండిపోవడంతో కంపచెట్ల తొలగింపు కొంత మందకొడిగా సాగింది. రెండు మూడు రోజులుగా వాతావరణం పొడిగా వుండడంతో పనుల్లో వేగం పెరిగింది. అమరావతిలో కంపచెట్లు తొలగించడంతో మొత్తం ప్రాంతమంతా మైదానంలా చదునుగా కనిపిస్తోంది. చెట్ల మధ్యలో ఇప్పటి వరకూ కనిపించకుండా పోయిన హైకోర్టు భవనం ఇప్పుడు దర్శనమిస్తోంది. చెట్ల మధ్య కనిపించకుండా పోయిన సైన్బోర్డులు, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల హద్దురాళ్లు ఇప్పుడు బయటపడుతున్నాయి.
Read Also: Arvind Kejriwal: ఎన్నికల ముందు శుభవార్త.. మరో 80,000 మందికి వృద్ధాప్య పెన్షన్
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు తుది దశకు చేరాయి. సుమారు 24 వేల ఎకరాల్లో రూ.36 కోట్ల వ్యయంతో ఆగస్టులో చేపట్టిన ఈ పనులు దాదాపు 96 శాతం మేర పూర్తయ్యాయి. గుత్తేదారు సంస్థ ఎన్సీసీ మొత్తం 99 గ్రిడ్లుగా విభజించి సుమారు 400 యంత్రాలతో ఈ పనులు చేపట్టింది. తొలగించిన ముళ్ల చెట్లు ఎండిపోయాక ముక్కలుగా కత్తిరించేందుకు ఒక టఫ్ గ్రైండింగ్ మెషీన్ తెచ్చారు.. ఆ ముక్కలను సిమెంట్ పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలించనున్నారు. 520 హార్స్ పవర్ ఇంజిన్ తో రోజుకు 50 టన్నులు పొడి చేసే కెపాసిటీ ఉన్న మెషీన్ అది.. ఈ పొడిని బయో డీజిల్ గానూ, బ్రికెట్లు గానూ తయారు చేస్తారు.. అయితే ఇండియాలో ఇవి రెండే ఉండటం విశేషం… త్వరలో మరో ఎనిమిది రప్పించి పని వేగవంతం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం… మొత్తంగా జంగిల్ క్లియరెన్స్ చివరి అంకంగా ముళ్ళ కంపను పొడి చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు.
తాజావార్తలు
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!