Home Minister Anita: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశాలు..
- వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై హోం మంత్రి సమీక్ష..
- వడ దెబ్బతో మృతి చెందినవారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం..
- విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anita: వడ దెబ్బతో మృతి చెందినవారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత… తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు.. ఈ సమీక్షలో హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.. ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలి.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. 2025 ఏప్రిల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని తెలిపారు.. 2014, 15, 16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3, 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందన్నారు.
Read Also: Jagdeep Dhankhar: సుప్రీంకోర్టుపై మరోసారి ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ఇక, తాగునీటి అవసరాలపై హోంమంత్రి అనిత ఆరా తీశారు.. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నట్లు సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ వెల్లడించారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్తో ముందుకెళుతున్నట్లు తెలిపారు సీడీఎంఏ డైరెక్టర సంపత్.. రాబోయే రోజుల్లో వడగాల్పులకు గల అవకాశాలపై హోంమంత్రి ఆరా తీయగా.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వ చేసినట్లు తెలిపిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.. 92 మండలాలను ముందస్తుగా గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.. పాఠశాలల్లో నీటితో పాటు, ఎన్జీవో, విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.. వడగాల్పుల ద్వారా వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం 5,145 పడకలను, 768 అంబులెన్సులు, సిద్ధం చేయడమే కాకుండా వైద్యులకు తగు శిక్షణనిచ్చి అప్రమత్తంగా ఉంచినట్లు పేర్కొన్నారు వైద్యశాఖ అధికారి.. వడదెబ్బ మరణాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత.. ఎండలు, వడగాల్పులపై అవగాహన పెంచాలన్న విపత్తు నిర్వహణ శాఖ మంత్రి.. సచివాలయం, వార్డు సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్.. రాష్ట్రవ్యాప్తంగా 20 నగరాలలో వడగాల్పుల అప్రమత్తత దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.. ఇక, వడాల్పులతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!