Vidadala Rajini: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టులో కీలక వాదనలు
- విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..
- రాజకీయ కక్షతో రజినిపై కేసు నమోదు చేశారని వాదన..
- తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు..
Vidadala Rajini: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ వాయిదా పడింది.. అయితే, ఈ రోజు కీలక వాదనలు జరిగాయి.. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. అసలు రాజకీయ కక్షతో రజినిపై కేసు నమోదు చేశారని హైకోర్టులో వాదనలు వినిపించారు రజిని తరఫు న్యాయవాది.. 2021లో ఘటన జరిగిందని ఇప్పుడు కేసు నమోదు చేశారని.. ప్రస్తుత ఎంపీ కృష్ణ దేవరాయలు కేసులో ఏ2గా ఉన్న ఐపీఎస్ జాషువా ఇచ్చిన నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మండిపడ్డారు.. ఈ ఎంపీ గత ప్రభుత్వంలో రజినితో పాటు ఒకే పార్టీలో అదే జిల్లాలో ఎంపీగా ఉన్నారని, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు తెలిపిన రజిని లాయర్..
Read Also: AP Secretariat: సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఘటనా స్థలానికి సీఎం.. చెత్తపై సీరియస్..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
ఇక, విజిలెన్స్ కి ఏ2 ఇచ్చిన నివేదిక ఆయనకు వచ్చిందటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రజిని తరపు న్యాయవాది.. అయితే, ప్రభుత్వం సమయం కొరటంతో తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. కాగా, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేయగా.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విడదల రజిని హైకోర్టును ఆశ్రయించారు.. ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడుతూ వస్తోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో