Annadata Sukhibhava: గుడ్న్యూస్.. ఇవాళే వారి ఖాతాల్లో సొమ్ము జమ..
- రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్..
- అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు విడుదల..
- నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- వీరాయపాలెంలో ఇవాళ ఈ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annadata Sukhibhava: రైతులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సూపర్-6 హామీల అమలులో భాగంగా – అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది.. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందనున్నారు.. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం 2,342.92 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్’ పథకం కింద మొదటి విడతగా రూ.2,000 చొప్పున 831.51 కోట్ల రూపాయలను రైతులకు సాయం అందించనుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్లో రూ.7,000 జమ కానున్నాయి.. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 అందించనున్నట్టు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఆ హామీ అమలుకు సిద్ధమైంది..
Read Also: Congress Legal Summit: నేడు ఢిల్లీలో ఏఐసీసీ న్యాయ సదస్సు.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.. దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ప్రతి రైతుకు ఏడాదికి 20వేల చొప్పున మూడు దపాలుగా ఆర్థిక సహాయం అందజేయనుంది ప్రభుత్వం.. తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల నగదును జమ చేయనున్నారు.. ఈ మొత్తంలో 5,000 రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 2,000 కేంద్ర పీఎం కిసాన్ నిధులు ఉంటాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,342 కోట్ల రూపాయల నిధులు జమ చేయనున్నారు.. అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా పంట పొలాల మధ్య ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం..
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కర్ ఉగ్రవాదులు ట్రాప్..
చంద్రబాబు పర్యటన షెడ్యూల్..
* ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం చంద్రబాబు..
* 10.50 దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలోని అన్నదాత సుఖీభవ వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం
* 11 గంటల నుంచి 1.15 గంటల వరకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న చంద్రబాబు..
* మధ్యాహ్నం 1.50 నుంచి 2.50 వరకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం
* తిరిగి 3 గంటలకు బయలుదేరి 3.40 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..