Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కర్ ఉగ్రవాదులు ట్రాప్..
- జమ్మూ కాశ్మీర్ కుల్గాంలో మొదలైన ఎన్కౌంటర్..
- భద్రతా బలగాల ట్రాప్లో లష్కరే ఉగ్రవాదులు..
- కొనసాగుతున్న కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్న హతం చేయడానికి భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ నిర్వహిస్తోంది. తాజాగా, కుల్గాంలోని అకల్ దేవ్సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ప్రస్తుతం భద్రతా బలగాల ట్రాప్లో చిక్కుకున్నారని తెలుస్తోంది.
Read Also: Kiren Rijiju: రాహుల్ గాంధీ పిల్లవాడు కాదు, దేశ ప్రతిష్టకు హాని కలిగించొద్దు..
Also Read
ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. సమాచారం ప్రకారం, కొనసాగుతున్న ఆపరేషన్లో భాగంగా శ్రీనగర్ సమీపంలోని దచిగామ్ నేషనల్ పార్క్ ప్రాంతంలో అనుమానాస్పద ఉగ్రవాద కదలికలు కనుగొన్నారు. లష్కర్ అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు అడవుల్లో దాక్కున్నారని భావిస్తున్నారు. ముందుగా మొత్తం ఐదుగురు టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందింది. వీరిలో ముగ్గురు సోమవారం ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఇద్దరు పరారీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..