Perni Nani: మీకు పాలన చేతకాకపోతే దిగిపోండి.. వైఎస్ జగన్కు అప్పగించండి..
- మీకు పాలన చేతకాకపోతే దిగిపోండి..
- వైఎస్ జగన్కు పాలన అప్పగించండి..
- పాలన ఎలా చేయాలో చేసి చూపిస్తారు..
Perni Nani: మీకు పాలన చేతకాకపోతే దిగిపోయి వైఎస్ జగన్కు అప్పగించండి.. పాలన ఎలా చేయాలో చేసి చూపిస్తారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు.. కేక్ కట్ చేశారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రఫుల్లా, వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేశారు.. ప్రజలు పాలకుల నుంచి ఏం కోరుకుంటున్నారనే విషయాలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న జగన్.. గొప్ప ఆశయంతో ఇదే రోజున ఎనిమిదేళ్ల క్రితం యాత్ర ప్రారంభించారు.. 3,548 కిలోమీటర్లు, 2,516 గ్రామాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలతో యాత్ర కొనసాగించారని గుర్తుచేశారు..
Read Also: SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి మూవీ లాంచ్కి ఆల్ స్టార్ సెలబ్రేషన్ ప్లాన్?
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ఇక, ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన తర్వాత రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 151 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనే విషయాన్ని గుర్తుశారు పేర్ని నాని.. ప్రజలు తమ గుండెల్లో ఉన్న బాధను పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారు.. ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకు దూరమై పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వారిని చూసారు. కళ్లతో చూసి మనసుతో విన్నారు కాబట్టే దేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయని విధంగా జగన్ పనిచేశారు.. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే పేదవాడి ఇంట్లో పిల్లలు చదవాలని నమ్మిన వ్యక్తి ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చారని పేర్కొన్నారు. అయితే, ఇవాళ స్కూల్స్ ఖాళీ చేసి ప్రైవేట్ దారిపడుతున్నారని విమర్శించారు..
పేదవాడికి ఉచిత వైద్యం కోసం డాక్టర్ల కొరత తీర్చేందుకు 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలు మొదలుపెట్టారు.. కరోనా సమయం తీసేస్తే మూడేళ్లలో ఐదు కళాశాలలు పూర్తి చేశారు.. మరో రెండు సిద్ధం చేశారు అని పేర్కొన్నారు పేర్ని నాని.. వైఎస్ జగన్ సంకల్పం చంద్రబాబు కొనసాగించి ఉంటే అన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి.. కానీ, రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన చేస్తున్నారు.. ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టి వేస్తున్నారు.. పెత్తందారి మనస్తత్వంతో ప్రజలకు వైద్యం, విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు.. ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు.. జగన్ ఎక్కడకి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. జగన్ వెళ్తే వెళ్ళారు ఎవరి ప్రాణాలు తీయవద్దని లోకేష్ వెటకారంగా మాట్లాడుతున్నారు.. అసలు మీ పర్యటనల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకు గుర్తు లేదా..? మీ పాలనలో ఆలయాల్లో ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు.. ఇంతమంది ప్రాణాలు పోతే మీకు బాధ్యత లేదా..? ఆలయాల్లో చనిపోతే ప్రైవేటు గుడి అని చెప్పటానికి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో