IAS Krishna Teja: ఏపీకి ఐఏఎస్ కృష్ణ తేజ.. డీఓపీటీ ఉత్తర్వులు
- ఏపీకి కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఎం. కృష్ణ తేజ..
- ఐఏఎస్ కృష్ణ తేజ డిప్యూటేషన్కు డీఓపీటీ గ్రీన్ సిగ్నల్..
- ఉత్తర్వులు జారీ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Krishna Teja: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.. ఆయనే కేరళ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎం. కృష్ణ తేజ.. ఆయన డిప్యూటేషన్పై ఏపీకి వస్తారని.. కీలక బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే ఐఏఎస్ కృష్ణ తేజకు డిప్యూటేషన్పై ఏపీకి వెళ్లేందుకు అనుమతి వచ్చేసింది.. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT) ఉత్తర్వులు జారీ చేరసింది.. ఇక, పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను కృష్ణ తేజకు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
Read Also: MLA Rajasingh: తెలంగాణకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా.. సీఎంకు రాజాసింగ్ రిక్వెస్ట్
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
అయితే, గత నెలలో సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ఐఏఎస్ కృష్ణతేజ.. ఆ తర్వాత కేరళలోని త్రిసూర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను డిప్యుటేషన్పై రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరడం.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాయడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.. మొత్తంగా ఎప్పుడు డీఓపీటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. త్వరలోనే ఏపీలో ఛార్జ్ తీసుకోనున్నారు కృష్ణతేజ.. ఇక, గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్గా సేవలు అందించారు కృష్ణ తేజ.. ఆయన స్వస్థలం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట.. ఇక, ఈ మధ్యే త్రిసూర్ జిల్లా కలెక్టర్గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన.. వివిధ శాఖల్లో పనిచేశారు.. ఐఏఎస్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు.. ఇప్పుడు ఏపీలో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!