NTR Bharosa Pensions: రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. 2.30 గంటల్లోనే..!
- రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ..
- ఉదయం 8.30 గంటలకు 63.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి..
- మొత్తం 64.82 లక్షల లబ్దిదారులు..
- 8.30 వరకు 41.26 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది.. ఉదయం 8.30 గంటల వరకే 63.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు అధికారులు.. మొత్తం 64.82 లక్షల లబ్దిదారులకు గాను ఇప్పటి వరకు 41.26 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యిందని అధికారులు చెబుతున్నారు.. లబ్దిదారులకు ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ద్వారా రూ. 1739 కోట్లు పంపిణీ చేశారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర గంటల్లోనే దాదాపు 64.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం రికార్డుగా చెబుతున్నారు.. పెన్షన్ల పంపిణీని వలంటీర్ల కంటే స్పీడుగా పంపిణీ చేస్తోన్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. రెండు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీని ఉద్యోగుల ద్వారా పూర్తి చేసేస్తోంది కూటమి ప్రభుత్వం.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే, పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి వారం రోజుల సమయం తీసుకుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. కానీ, గత ప్రభుత్వం కంటే తక్కువ మంది సిబ్బందితోనే పెన్షన్ల పంపిణీని ప్రణాళికా బద్దంగా చేపడుతోంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు.. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పింఛన్ దారులు. గత నెల పెండింగ్ పెన్షన్తో కలిపి రూ. 7 వేలు ఇచ్చిన ప్రభుత్వం. ఈ నెల నుంచి రూ. 4 వేల పెన్షన్ పంపిణీ చేపడుతోంది ప్రభుత్వం.. మరోవైపు.. ఈ రోజు మడకశిరలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.. జిల్లాల్లో పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!