Free Bus Facility For Women: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇవాళ క్లారిటీ..!
- త్వరలోనే ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
- దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం...
- ఈ రోజు రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- ఏపీఎస్ఆర్టీసీకి అదనంగా 2 వేల బస్సులు..!
- 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Bus Facility For Women: అటు కర్ణాటక.. ఇటు తెలంగాణలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఇక, ఎన్నికల్లో హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ కూడా కసరత్తు చేస్తోంది.. త్వరలోనే ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు రవాణాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు.. అదే విధంగా రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.
Read Also: Prabhas: ప్రభాస్ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్ను పట్టించుకోరు: సుధీర్ బాబు
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకొస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సిన అవసరం ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండగా.. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా.. మిగతావి అద్దె బస్సులు. మరోవైపు.. గతంలో 1,480 కొత్త బస్సుల కొనగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్ పూర్తిచేసుకొని డిపోలకు చేరుతూనే ఉన్నాయి.. ఇక, మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చారు.. మరో వైపు ఈ స్కీమ్తో ఆర్టీసీకి నెలకు రూ. 250-260 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం అంటే దాదాపు రూ.125 కోట్లు ప్రభుత్వం తీసుకుంటోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మాత్రం.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకపోవడంతో పాటు.. అదనంగా రూ.125-135 కోట్లు అదనంగా ప్రభుత్వమే.. ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది.. అయితే, రవాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలో దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తు్న్నారు.. నేటి సమీక్షలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
Read Also: Fenugreek seeds: మెంతులు చూడడానికి అంతే ఉన్న తింటే మాత్రం బోలెడు ప్రయోజనాలు..
వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
ఇక, ఈ రోజు వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.. హోం శాఖ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు చేయనున్నారు.. ఏపీలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చ. ఆస్పత్రుల్లో గొడవలు జరగ్గకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సమీక్ష. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రస్తావన తీసుకురానున్నారు.. అదే విధంగా.. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్-AP ANTF బలోపేతంపై చర్చించనున్నారు.. ఇసుక పాలసీ అమలుపై సమీక్షించనున్న సీఎం.. ఇసుక లభ్యత.. ఇసుక రవాణ ఛార్జీల నియంత్రణపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!