CM Chandrababu: ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. ఆదాయం పెంచేలా చూడండి..!
- ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
- జీఎస్టీ వసూళ్లపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆదాయార్జన శాఖలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. మధ్యాహ్నం ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు.. జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.. ఇక, జీఎస్టీ క్లైమ్ల విషయంలోనూ అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి.. గత ప్రభుత్వంలో ఎక్సైజ్, గనుల వంటి శాఖలను తమ సొంత ఆదాయాలను పెంచుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు చంద్రబాబు.. ప్రజలకు ఇబ్బందుల్లేని పాలసీలతో అమలు చేస్తూనే.. ఆదాయం పెంచేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. ఆదాయార్జన శాఖల్లో ఉన్న లూప్ హోల్స్ను సరి చేసుకుంటే మరింత ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read Also: Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో ధరణి పోర్టల్ రద్దు.. త్వరలో కొత్త చట్టం
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఇక, సమీక్షలు, సమావేశాలు ముగిసిన తర్వాత తిరుమల పర్యటనకు బయల్దేరి వెళ్లారు సీఎం చంద్రబాబు.. తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు రోడ్డు మార్గంలో వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లనున్నారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీవారికి ఏపీ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు..
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!