CM Chandrababu: ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యాను.. అప్పుడు మైక్రోసాఫ్ట్- ఇప్పుడు గూగుల్!
- టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు క్వాంటం టాక్..
- రాష్ట్రంలో ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సె్స్ అయ్యాను..
- అప్పుడు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు గూగుల్ ను తీసుకొచ్చా: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లలో 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా ఈరోజు ( డిసెంబర్ 23న) ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీ ప్రాధాన్యతపై ప్రధానంగా చర్చించారు.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీని ప్రమోట్ చేయడంలో తాను సక్సె్స్ అయినట్లు తెలిపారు. 1998లో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు రప్పించాం.. ఇప్పుడు (2025) విశాఖకు గూగుల్ సంస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గూగుల్ 15 బిలయన్ డాలర్ల పెట్టుబడులను వైజాగ్ లో పెట్టనుందన్నారు. ఇక, ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తామన్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది.. సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు..?
ఇక, ఓ ట్రాన్సఫర్మేషనల్ ఛేంజ్ క్వాంటం ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారథ్యం వహిస్తుంది.. ఎవరినీ అనుసరించదని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేస్తున్నాం.. క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తామని చెప్పారు. నవంబర్ 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది.. క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!